News December 29, 2024

పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలి: డీఐఈఓ

image

మార్చి 5 నుంచి నిర్వహించే ఇంటర్ వార్షిక పరీక్షలకు పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ అన్నారు. వరంగల్ పట్టణంలోని పలు ప్రైవేట్ కళాశాలలు, పరీక్షా కేంద్రాలను డీఐఈఓ సందర్శించారు. వార్షిక పరీక్షలకు గాను అన్ని గదుల్లో డ్యుయల్ డెస్కులు, గాలి, నీరు, విద్యుత్, ఫ్యాన్లు, నీటి వసతి, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని డీఐఈఓ సూచించారు.

Similar News

News October 14, 2025

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఘన స్వాగతం

image

వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు బయలుదేరారు. మార్గమధ్యంలో ఖాజీపేట రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి, ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలను రాంచందర్‌రావు పలకరించి, ముందుకు సాగారు.

News October 12, 2025

వరంగల్: 97%తో రికార్డు స్థాయిలో పల్స్ పోలియో

image

నేటి ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగింది. మొత్తం 20,101 మంది పిల్లలకు లక్ష్యంగా, 19,546 మందికి పోలియో వ్యాక్సిన్ వేసి 97 శాతం రికార్డు సాధించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.సాంబశివరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పక వేయించాలన్నారు.

News October 12, 2025

పదో వసంతంలోకి వరంగల్ జిల్లా..!

image

వరంగల్ జిల్లా 2016 అక్టోబర్ 11న ఏర్పాటైంది. నిన్నటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న జిల్లా నేటి నుంచి పదో వసంతంలోకి అడుగు పెట్టింది. కాగా కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత అభివృద్ధి పనులు జరిగాయని కొందరు.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మరికొందరు అంటున్నారు. గ్రామీణ రోడ్లు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వ భవనాలు, స్కూళ్లు, హాస్టళ్లు సరిగా లేవని చెబుతున్నారు. మీ జిల్లా అభివృద్ధి అయ్యిందా కామెంట్ చేయండి.