News March 16, 2025
పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్త్ ఏర్పాటు చేయాలి: కలెక్టర్

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా SP ఆర్ గంగాధరరావు, క్షేత్రాధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 145 కేంద్రాలలో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News December 4, 2025
గుడివాడ-కంకిపాడు రోడ్డు నిర్మాణం ప్రారంభించండి: బాలశౌరి

ఢిల్లీలోని పార్లమెంట్ హాల్లో CoSL ఛైర్మన్ ఎంపీ బాలశౌరితో నేషనల్ హైవే ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గుడివాడ-కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, పెడన లక్ష్మీపురం రోడ్డు, తదితర పనులను ఎంపీ బాలశౌరి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, ఆ పనులను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
News December 4, 2025
కృష్ణా జిల్లా అమర గాయకుడు జయంతి నేడు

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా సంగీతాభిమానులు ఆయనను స్మరించుకుంటున్నారు. 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా చౌటపల్లిలో జన్మించిన ఘంటసాల, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తెలుగు పాటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. అనేక భాషల్లో ఆయన ఆలపించిన గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. “చివరి శ్వాస వరకు గానం చేస్తాను” అన్న ఆయన మాటలు సంగీతాభిమానులను ముద్దుపెట్టుకుంటూనే ఉన్నాయి.
News December 3, 2025
కృష్ణా: డీసీసీ అధ్యక్షుల రేసులో అందె, శొంఠి

కాంగ్రెస్ పార్టీ పునః నిర్మాణంలో భాగంగా తొలుత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టనుంది. కృష్ణాజిల్లా డీసీసీ పదవికి ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అవనిగడ్డకు చెందిన అందే శ్రీరామ్మూర్తి, పెడనకు చెందిన శొంఠి నాగరాజు రేసులో ముందు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇటీవలే జిల్లాకు పరిశీలకునిగా వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సంజయ్ దత్ మచిలీపట్నం వచ్చి అభిప్రాయసేకరణ చేపట్టి వెళ్లారు.


