News May 23, 2024
పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడండి: కలెక్టర్
10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు.
Similar News
News October 2, 2024
నంద్యాల: గ్రీన్ కో పవర్ లైన్పై సమీక్ష
గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ లైన్ ట్రాన్స్మిషన్ ఏర్పాటుపై కలెక్టర్ రాజకుమారి మంగళవారం నంద్యాల కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ లైన్ ట్రాన్స్మిషన్కు సంబంధించి షెడ్యూల్ కులాల హక్కులకు భంగం కలగకుండా డివిజనల్ కమిటీ సూచించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు.
News October 2, 2024
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి మెడిసిన్ సీటు
బనగానపల్లెలోని మంగళవారం పేటకు చెందిన సలాం, నాయుమున్నిసా దంపతులు కుమారుడు కలీమ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫేస్-2 ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించారు. దీంతో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతనికి సీటు దక్కింది. కలీమ్ తల్లి SGT ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి స్వర్ణకారుడిగా పని చేస్తున్నారు. కాగా, కలీమ్ GOVT జూనియర్ కళాశాలలో చదివి సీటు సాధించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
News October 1, 2024
సీఎం సమక్షంలో హామీ ఇచ్చిన మంత్రి టీజీ భరత్
కర్నూలు జిల్లాలో త్వరలోనే టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో సీఎంతో కలిసి ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో టమోటా పంటను ఎక్కువగా సాగు చేస్తారన్నారు. యూనిట్ నెలకొల్పేందుకు ఉన్న వివాదాలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం సమక్షంలో చెప్పారు.