News March 17, 2025
పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమలు చేయాలి: BHPL కలెక్టర్

పదవ తరగతి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా రూట్లు వారిగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్టీసీ సీఎంకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు.
Similar News
News March 18, 2025
సంగారెడ్డి: ఇంటి వద్దకే భద్రాచలం తలంబ్రాలు

భద్రాచలం సీతారాముల తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రీజనల్ మేనేజర్ ప్రభులత మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు లాజిస్టిక్ కేంద్రాలు రూ.150 చెల్లించి బుక్ చేసుకోవాలని చెప్పారు. సీతారాముల కళ్యాణం తర్వాత ఇంటికి వచ్చి తలంబ్రాలను తమ సిబ్బంది అందిస్తారని పేర్కొన్నారు.
News March 18, 2025
ఆ విషయంలో కేంద్రం నుంచి నిధులు రాలేదు: మంత్రి శ్రీధర్ బాబు

TG: గోదావరి నుంచి నీటి తరలింపునకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలిపారు. గుజరాత్, యూపీ రివర్ ఫ్రంట్లకు నిధులిచ్చి నదుల ప్రక్షాళన చేశారన్నారు. గోదావరి నుంచి 2.5 టీఎంసీల నీటిని మూసీకి తరలించే ప్రాజెక్టుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని చెప్పారు.
News March 18, 2025
సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు ఇలా నమోదు అయ్యాయి. ఇల్లంతకుంట 40.9°c, కోనరావుపేట 40.7 °c,గంభీరావుపేట 40.3°c, చందుర్తి 45.3°c, బోయిన్పల్లి 40.3°c, వీర్నపల్లి 39.9 °c,రుద్రంగి 39.5°c, తంగళ్ళపల్లి 39.4 °c, లుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇల్లంతకుంట, కోనరావుపేట మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది.