News March 1, 2025

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు: ఎస్పీ 

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 1 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, గాడ్జెట్లు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల చుట్టూ ఉండే జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

Similar News

News October 20, 2025

ప్రమాదాలు జరిగితే ఈ నంబర్లకు కాల్ చేయండి: SP

image

మతాబులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ దామోదర్ ఆదివారం సూచించారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే మతాబులు కాల్చాలని, పాత లేదా తడిసిన మతాబులు వినియోగించరాదని చెప్పారు. కాటన్ దుస్తులు ధరించాలనీ, నైలాన్ లేదా సింథటిక్ దుస్తులు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 101, 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News October 20, 2025

ADB: ‘బాణసంచా కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి’

image

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. టపాసులు కాల్చే సమయంలో కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. ముఖం దగ్గరగా పెట్టి బాణసంచా కాల్చకండి. మీ పిల్లల పక్కనే మీరు ఉండి టపాసులు కాల్చండి. పేలని టపాసుల వద్దకు వెళ్ళకూడదు. అవి ఎప్పుడు పేలేది తెలియాదు. బాగా పొగ ఎక్కువ వచ్చే టపాసులను కాల్చకూడదు. దీనివల్ల ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది.

News October 20, 2025

దీపావళి: ఇవాళ ఏం చేయాలి?

image

హిందువులకు ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి సాయంకాలం దీపాలతో అలంకరించాలి. కుటుంబసభ్యులతో కలిసి లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. దుస్తులు, స్వీట్లు లేదా ఆహారపదార్థాలను దానం చేయాలి. ఆసక్తి ఉంటే రాత్రి వేళలో <<18052455>>జాగ్రత్తలు<<>> పాటిస్తూ టపాసులు కాల్చాలి.