News March 12, 2025

పరీక్ష జరిగి 2 నెలలు.. విడుదల కానీ ఫలితాలు

image

JNTU యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సంబంధించి రెండు, మూడో సంవత్సర విద్యార్థుల పరీక్షలు పూర్తయి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఫలితాలను అధికారులు విడుదల చేయలేదు. ఫలితాలు విడుదల కాక విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికైనా అధికారులు ఫలితాలు విడుదల చేస్తారని కొండంత ఆశతో విద్యార్థులు ఎదురుచూస్తున్న అధికారుల తీరులో మార్పు లేకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 10, 2026

విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి కలిసిపోతాయి: సీఎం

image

AP: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీలను అమరావతికి తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే 6 నెలల్లోనే క్వాంటం కంప్యూటర్ అమరావతి నుంచి పనిచేయటం ప్రారంభిస్తుందన్నారు. కొందరు అమరావతి నిర్మాణ వేగాన్ని చూసి అసూయ చెందుతున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి.. అన్నీ కలిసిపోయి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా తయారవుతుందని ఓ కాలేజీ వార్షికోత్సవ సభలో వివరించారు.

News January 10, 2026

హైదరాబాద్‌లో ఈ సంక్రాంతికి ఫుల్ ఎంజాయ్!

image

ఈ పండక్కి సిటీలో మామూలు హంగామా లేదు బాసూ. పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13-15 వరకు ‘కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్’ అదిరిపోనుంది. 19 దేశాల పతంగులు, 1200 రకాల పిండివంటలతో ఫుడ్ లవర్స్‌కు పండగే. అసలైన కిక్కు గచ్చిబౌలిలో 16, 17 తేదీల్లో జరిగే ‘మెగా డ్రోన్ షో’. ఆకాశంలో రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్ల విన్యాసాలు కనువిందు చేయనున్నాయి. హైడ్రా పుణ్యమా అని పునరుజ్జీవం పొందిన చెరువుల దగ్గరా గాలిపటాల పండగ జరుగుతుంది.

News January 10, 2026

హనుమకొండ: రూ.7.85 లక్షల విలువైన బంగారం చోరీ

image

కేయూ పీఎస్ పరిధిలో పట్ట పగలే దొంగతనం జరిగింది. శివసాయి కాలనీలో తాళం వేసిన ఇంట్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూ.7.85 లక్షల విలువైన బంగారం దోచుకెళ్లినట్లు బాధితుడు గోపాల కృష్ణ తెలిపారు. తన అమ్మాయి కాలేజ్ ఫీజు కోసం దాచుకున్నట్లు చెప్పారు. కేయూ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని డిసీపీ, ఏసీపీ, సీసీఎస్ పోలీసులు పరిశీలించారు.