News March 12, 2025

పరీక్ష జరిగి 2 నెలలు.. విడుదల కానీ ఫలితాలు

image

JNTU యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సంబంధించి రెండు, మూడో సంవత్సర విద్యార్థుల పరీక్షలు పూర్తయి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఫలితాలను అధికారులు విడుదల చేయలేదు. ఫలితాలు విడుదల కాక విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికైనా అధికారులు ఫలితాలు విడుదల చేస్తారని కొండంత ఆశతో విద్యార్థులు ఎదురుచూస్తున్న అధికారుల తీరులో మార్పు లేకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 14, 2026

తొందరపాటు నిర్ణయంతో 90% మంది ఫెయిల్: మంత్రి

image

AP: 2019-24 మధ్య సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టిన సంస్కరణలతో విద్యా వ్యవస్థ వెనుకబాటుకు గురైందని మంత్రి కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘తొందరపాటు నిర్ణయంతో 1,000 స్కూళ్లను CBSE విధానానికి మార్చడం వల్ల 90% మంది విద్యార్థులు పాస్ కాలేకపోయారు. టీచర్ల సన్నద్ధత లేకపోవడంతో “టోఫెల్” ఫెయిలైంది. పరిపాలనా వైఫల్యంతో “నాడు-నేడు”లో ₹7,875Cr మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలాయి’ అని వివరించారు.

News February 14, 2026

అమరావతిలో రూ.57,868 కోట్లతో పనులు: మంత్రి పయ్యావుల

image

AP: 2026 మార్చి నాటికి అన్న క్యాంటీన్ల సంఖ్యను 275కు పెంచుతామని మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 204 క్యాంటీన్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక పేద కుటుంబాలకు 25 లక్షల పట్టాలు/ఇళ్లను అందించి, సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో రూ.57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశామని వివరించారు.

News February 14, 2026

C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(C-DOT)లో 10 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్కిల్/ రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.