News March 4, 2025

పరీక్ష సమయాల్లో ట్రాఫిక్ సమస్య రానియద్దు: వరంగల్ సీపీ

image

రేపటి నుంచి ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య రాకుండా ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు సైతం ముందస్తూ చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రధానంగా విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేందుకు పోలీసులు తమ వంతు సహకారాన్ని అందజేయాలని సూచించారు.

Similar News

News January 13, 2026

నేటి నుంచి పరేడ్ గ్రౌండ్స్‌లో పతంగుల పండుగ

image

TG: Hyd పరేడ్ గ్రౌండ్స్‌లో ఈరోజు నుంచి 18వ తేదీ వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకల్లో 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అలాగే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. పతంగులతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా నిలవనున్నాయి. భద్రత దృష్ట్యా మాంజా దారాన్ని నిషేధించారు. సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.

News January 13, 2026

జనవరి 13: చరిత్రలో ఈరోజు

image

✯1948: హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టారు
✯1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం
✯1919: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం
✯1949: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం
✯1995: సినీ నటుడు వైష్ణవ్ తేజ్ జననం
✯2014: తెలుగు సినిమా నటి అంజలీదేవి మరణం

News January 13, 2026

ముగ్గురు ఇండియన్లను రిలీజ్ చేసిన అమెరికా!

image

అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా ఆయిల్ ట్యాంకర్‌లో ముగ్గురు భారతీయులు ఉండటం తెలిసిందే. ఇవాళ వారిని అధికారులు రిలీజ్ చేశారు. ముగ్గురి క్షేమ సమాచారం కోసం భారత అధికారులు USతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. భారత్ ఒత్తిడి నేపథ్యంలో వారిని విడుదల చేశారు. నార్త్ అట్లాంటిక్‌లో రష్యా జెండాతో వెళ్తున్న క్రూడాయిల్ ట్యాంకర్‌ను ఈనెల 7న US స్వాధీనం చేసుకుంది. అందులోని 28 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుంది.