News April 2, 2025
పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నెహ్రూనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్లాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వంశీ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 14, 2025
17న ఒంగోలులో కలెక్టర్ మీకోసం కార్యక్రమం

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన కలెక్టర్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గత సోమవారం కనిగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే 17వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే కలెక్టర్ మీకోసంలో ఆయన పాల్గొననున్నారు.
News November 14, 2025
17 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం

ఈనెల 17వ తేదీ నుంచి చేపట్టే చర్మరోగ పరీక్షల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏ రోగమైనా ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగిన జాగ్రత్తలు, వైద్యం అందించేందుకు వీలుగా ఉంటుందన్నారు.
News November 14, 2025
సెల్ ఫోన్ వద్దు – పుస్తకం ముద్దు: ప్రకాశం కలెక్టర్

విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, పుస్తకాలకు చేరువ కావాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని శాఖ గ్రంథాలయంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత, పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


