News February 1, 2025

పర్చూరు టీడీపీ నగర అధ్యక్షుడు మృతి

image

పర్చూరు TDP నగర అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణ గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన పర్చూరు MLA ఏలూరి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడు. TDPలో క్రియాశీలక వ్యక్తి అని పలువురు తెలిపారు. పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని MLA ఏలూరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా వెంకటకృష్ణ సతీమణి శ్రీలక్ష్మీ నెలరోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నెల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News December 23, 2025

త్వరలో 22వేల గ్రూప్-D పోస్టులకు నోటిఫికేషన్

image

RRB త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలో కలిపి 22 వేల గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెన్త్, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జనవరి 21 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల వయసు 18-33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. నెలకు జీతం రూ. 18,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in

News December 23, 2025

అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల

image

సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అడిషనల్ సొలిసిటర్ జనరల్స్‌ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇందులో మాజీ ఎంపీ, అడ్వకేట్ కనకమేడల రవీంద్రకుమార్‌, దవీందర్‌పాల్ సింగ్‌కు చోటు కల్పించింది. వీరు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. కాగా రవీంద్ర కుమార్ 2018 నుంచి 2024 వరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

News December 23, 2025

ఏలూరు: రైలు ఢీకొని యువకుడి మృతి

image

రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన దెందులూరు మండలం సీతంపేటలో మంగళవారం జరిగింది. కాలి సన్నీ (20) ఐటీఐ పూర్తి చేసి బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల సెలవుపై స్వగ్రామం సీతంపేట వచ్చారు. మంగళవారం బయటకు వెళ్లిన సన్ని రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. ప్రమాదంలో సన్ని మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ శివన్నారాయణ తెలిపారు. కేసు నమోదు చేశామని తెలిపారు.