News April 6, 2024
పర్చూరు నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యే లక్ష్మీపద్మావతి

పర్చూరు నియోజకవర్గంలో 1999 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఆమె పర్చూరు నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలి మహిళా మంత్రిగా మరో గుర్తింపు పొందారు.
Similar News
News October 15, 2025
రేపు కూడా ప్రకాశం జిల్లాకు భారీ వర్షసూచన

ప్రకాశం జిల్లాలో గురువారం సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచించారు. అలాగే భారీ హోర్డింగ్ ల వద్ద, చెట్ల వద్ద వర్షం సమయంలో నిలబడరాదన్నారు. కాగా బుధవారం సాయంత్రం జిల్లాలోని పలుచోట్ల మోస్తారు వర్షం కురిసింది.
News October 15, 2025
ప్రకాశం జిల్లాలో 38,866 ఎకరాల భూమి.. ఆలయాల పరిధిలోనే!

జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దేవదాయ శాఖ అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ ఏసీ పానకాలరావు మాట్లాడుతూ.. జిల్లాలో దేవదాయ శాఖ పరిధికి సంబంధించి 1001 దేవాలయాలు ఉన్నాయని, వీటి పరిధిలో 38,866.95 ఎకరాల భూమి ఉందన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.
News October 15, 2025
ఒంగోలులో వ్యక్తి మిస్సింగ్.. ఎక్కడైనా చూశారా..!

ఒంగోలు పరిధిలోని శ్రీనగర్ కాలనీ ఒకటవ లైన్లో ఉండే భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి (దేవుడు) ఆదివారం మిస్ అయినట్లు ఒంగోలు తాలూకా PSలో ఫిర్యాదు అందింది. మిస్ అయిన వ్యక్తి భార్య వివరాల ప్రకారం.. పొన్నలూరు మండలం కొత్తపాలెంకి చెందిన శ్రీనివాసరెడ్డి ఒంగోలులో స్థిరపడ్డారు. కాగా ఆదివారం బ్యాంక్లో క్రాఫ్లోన్ కట్టేందుకు స్వగ్రామానికి వెళ్లున్నానని వెళ్లాడన్నారు. వివరాలు తెలిస్తే 9177688912కు కాల్ చేయాలన్నారు.