News January 31, 2025
పర్చూరు: భార్య చనిపోయిన నెలకే భర్త మృతి

పర్చూరు గ్రామంలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. పర్చూరు 14వ వార్డు మెంబర్, టీడీపీ పర్చూరు పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల కృష్ణ శుక్రవారం హఠాన్మరణం చెందారు. హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మృతి చెందినట్లు టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ శంషుద్దీన్ తెలిపారు. కాగా నెల క్రితమే కృష్ణ భార్య అనారోగ్య కారణంగా మృతి చెందింది. అగ్నిగుండాల కృష్ణ మృతితో పర్చూరు గ్రామంలో, టీడీపీలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News November 24, 2025
అమరావతి: 10 లక్షల సురక్షిత పనిగంటలు పూర్తి

అమరావతిలో నిర్మిస్తున్న హౌసింగ్ & బిల్డింగ్ ప్రాజెక్టులలో భాగంగా NGO టవర్స్ 9 & 12 నిర్మాణ పనులను L&T కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో ఈ నెల 18 వరకు 10 లక్షల సురక్షితమైన పనిగంటలను లాస్ట్ టైమ్ ఇంజరీ లేకుండా విజయవంతంగా పూర్తిచేసిందని అధికారులు చెప్పారు. ఈ ప్రాజెక్టులో సాధించిన మైలురాయి నిర్మాణ రంగంలో CRDA పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనమన్నారు.
News November 24, 2025
NRPT: ప్రేమ విఫలం.. యువకుడు SUICIDE

ప్రేమించిన అమ్మాయి దక్కట్లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాగనూరు (M) కొత్తపల్లిలో జరిగింది. SI అశోక్ బాబు వివరాలు.. కొత్తపల్లికి చెందిన శంకర్(19), బంధువుల అమ్మాయిని కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తుండటంతో తనకు అమ్మాయి దక్కదని ఇంట్లో ఉరేసుకుని మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని అన్న మహేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
News November 24, 2025
లింగ సమానత్వానికి కృషి చేయాలి: కర్నూలు కలెక్టర్

సమాజంలో లింగ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “జెండర్ సమానత్వం” జాతీయ ప్రచార పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా “నయీ చేతన 4.0 –మార్పు కోసం ముందడుగు” పేరుతో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.


