News January 31, 2025

పర్చూరు: భార్య చనిపోయిన నెలకే భర్త మృతి

image

పర్చూరు గ్రామంలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. పర్చూరు 14వ వార్డు మెంబర్, టీడీపీ పర్చూరు పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల కృష్ణ శుక్రవారం హఠాన్మరణం చెందారు. హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మృతి చెందినట్లు టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ శంషుద్దీన్ తెలిపారు. కాగా నెల క్రితమే కృష్ణ భార్య అనారోగ్య కారణంగా మృతి చెందింది. అగ్నిగుండాల కృష్ణ మృతితో పర్చూరు గ్రామంలో, టీడీపీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News December 19, 2025

సూర్యాపేట: ఈనెల 22న జిల్లాలో విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్

image

ప్రజలకు విపత్తు సమయంలో అవసరమైన సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడారు.జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 22న మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వరదలు, పరిశ్రమ, రహదారి ప్రమాదాల సమయంలో ప్రజలను రక్షించడం,ఉపశమన శిబిరాలు ఏర్పాటు చేయడం,వైద్య, అగ్నిమాపక, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేయడం ముఖ్యమన్నారు.

News December 19, 2025

వాస్తు ప్లాన్లలో ఉత్తర దిశ ప్రాధాన్యత

image

వాస్తుశాస్త్రంలో తూర్పు దిశకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఇంటి లేఅవుట్లలో ఉత్తర దిశనే ప్రామాణికంగా గుర్తిస్తారు. దీనికి ప్రధాన కారణం ఉత్తర దిశ నుంచి నిరంతరం ప్రవహించే అయస్కాంత తరంగాలేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘పంచభూతాల సమన్వయానికి ఈ దిశ దిక్సూచిలా పనిచేస్తుంది. వినాయక వృత్తాంతంలోనూ ఉత్తర దిశ విశిష్టత గురించి ఉంది. అందుకే ప్లాన్లలో దిశల స్పష్టత కోసం ఉత్తరాన్ని వాడుతారు. <<-se>>#Vasthu<<>>

News December 19, 2025

KNR: మేడారం జాతరకు 700 బస్సులు: ఆర్ఎం

image

KNR బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో KNR RM బి.రాజు JAN 2026లో జరుగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి రీజియన్ లోని అందరు డిపో మేనేజర్లు, అన్ని డిపోలకు చెందిన ట్రాఫిక్ ఇంఛార్జులు, మెకానికల్ ఇంఛార్జుల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. రీజియన్ పరిధిలోని 6 ఆపరేటింగ్ పాయింట్లు ద్వారా మేడారానికి నడుపనున్న 700 బస్సులకు ఆపరేటింగ్ పాయింట్ల వద్ద అవసరమైన మౌళిక వసతులు, ఇతర అంశాలపై సమీక్షించారు.