News April 6, 2025

పర్చూరు: శ్రీరామ పట్టాభిషేకానికి 1818 నాటి రాగి నాణెం

image

బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడులోని పురాతన కోదండరామ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదిపూడి గ్రామానికి చెందిన కాల్వ రఘు రామయ్య శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించి 1818లో ముద్రించిన రాగి నాణేలను ప్రదర్శించారు. ఆనాటి నాణేన్ని చూడడానికి ఆసక్తిగా గ్రామ ప్రజలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఆలయంలో సందడినెలకొంది.

Similar News

News October 17, 2025

MBNR: రూ.12 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ఏంఎస్ఎన్ రెడ్డి

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియం నిర్మాణం కోసం మన్నె సత్యనారాయణ రెడ్డి రూ.12 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ.. ‘ఈ నేల పుట్టిన బిడ్డగా పాలమూరు విశ్వవిద్యాలయం వేదికపై మాట్లాడటం నాకు గొప్ప గౌరవంగా ఉంది. ఒకప్పుడు వలసల కోసం పేరుగాంచిన పాలమూరు, ఇప్పుడు విద్య, ఆరోగ్యం, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి సాధించడం గర్వకారణం’ అని అన్నారు.

News October 17, 2025

యూసుఫ్‌గూడ: అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

image

అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరుతున్నారు.

News October 17, 2025

గుండ్లకమ్మ ప్రాజెక్టుపై అధికారులకు కలెక్టర్ సూచనలు

image

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కింద 50 ఎకరాల భూసేకరణ చేయకపోవడంతోనే బాపట్ల జిల్లాలోని 13,876 ఎకరాలకు సాగునీరు రావడంలేదని కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం చెప్పారు. ఇంకొల్లు మండలం దుద్దుకూరులో 50 ఎకరాల భూసేకరణ పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. తక్షణమే భూ సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 14 గేట్లు మరమ్మతులు పూర్తి కాగా, మరొకదానికి పనులు జరుగుతున్నాయన్నారు.