News August 22, 2024
పర్యాటకశాఖ అభివృద్ధి పనులపై మంత్రి జూపల్లి సమీక్ష

మహబూబ్ నగర్ జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..నిర్దేశించిన సమయంలోగా చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. జిల్లాకేంద్రంలో నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ పనులను పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి సారించాలని, మినీ ట్యాంక్ బండ్ ను దగ్గరలోఉన్న కాల్వ ద్వారా కృష్ణ నీటితో నింపాలని సూచించారు.
Similar News
News November 18, 2025
MBNR: వేతనాలు అకౌంట్లో జమ:వీసీ

పాలమూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి యూనివర్సిటీ వీసీ జిఎన్ శ్రీనివాస్ గుడ్ న్యూస్ తెలిపారు. ఇవాళ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 3,4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ఐఎఫ్ఎమ్ఎస్, పిఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలను జరుగుతుందన్నారు. వేతనాలు వారి అకౌంట్లో జమ అయ్యే విధంగా ప్రయత్నించినారని తెలిపారు.
News November 18, 2025
జడ్చర్ల: అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.. వారి వివరాలు పప్పు (ఒడిశా) హరేందర్( బిహార్) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పప్పున్, సాతి మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2025
MBNR: పీయూలో “నషా ముక్త్ భారత్ అభియాన్”

పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా కళాశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తన సందేశంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మాళవి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనురాధ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


