News March 20, 2025
పర్యాటకులను మెప్పించేలా మరుగుదొడ్లు: కమిషనర్

వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం నగరంలోని కేటీ రోడ్, జక్కంపూడి, వైవీఆర్ ఎస్టేట్స్, పాతపాడు, అయోధ్య నగర్ ప్రాంతాలను గురువారం పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు పర్యాటకులను ఆకర్షించేలా ఉండాలన్నారు. నూతన మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. మహిళల కోసం ప్రతి సర్కిల్లో పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న STP లు, రిజర్వాయర్లు, పిగ్ షెడ్ పనులను వేగంగా పూర్తిచేయాలని అన్నారు.
Similar News
News March 31, 2025
OU దూర విద్యలో ప్రవేశాలకు రేపు లాస్ట్ డేట్

ఓయూ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్-2 కింద UG, PG, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది. అర్హులైన వారు మార్చి 31లోగా అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News March 31, 2025
నేహా కక్కర్ కన్సర్ట్.. నిర్వాహకులకు రూ.4.52 కోట్ల నష్టం

బాలీవుడ్ స్టార్ సింగర్ నేహా కక్కర్ వల్ల తమకు రూ.4.52 కోట్ల ($5,29,000) నష్టం వచ్చినట్లు మ్యూజిక్ కన్సర్ట్ నిర్వాహకులు తెలిపారు. ఆమె షో వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కన్సర్ట్కు నేహా 3 గంటలు ఆలస్యంగా వెళ్లారు. దీంతో తనకు నిర్వాహకులు డబ్బులు చెల్లించలేదని ఆమె ఆరోపించారు.
News March 31, 2025
VKB: పోలీస్ స్టేషన్గా మారిన ఆర్డీవో ఆఫిస్

పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం పోలీస్ స్టేషన్గా కనిపిస్తుండడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంను పోలీస్ కార్యాలయంగా మార్చిన వెబ్ సిరీస్ షూటింగ్ నిర్వాహకులు. వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయాన్ని ఆదివారం సెలవు ఉండడంతో వెబ్ సిరీస్కు అనుమతి ఇచ్చారు. దీంతో నిర్వాహకులు ఆర్డీవో కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్గా మార్చి షూటింగ్ నిర్వహిస్తున్నారు.