News March 8, 2025

పలమనేరు: పేదరికం నుంచి SI వరకు

image

పేదరికంలో పుట్టినా ఏ రోజు వెనుకడుగు వేయలేదు. తల్లిదండ్రుల కష్టాలను చూసి ఉన్నత స్థాయికి ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుంది. లక్ష్యం కోసం అహర్నిషలు కష్టపడుతూ అనుకున్నది సాధించారు పలమనేరు SI కె.స్వర్ణలత. సత్యసాయి(D) ధర్మవరానికి చెందిన ఆమె 1993న జన్మించారు. చిన్నతనంలో కష్టాలను చూసి గొప్ప స్థాయిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. బీఈడీ పూర్తి చేసిన ఆమె 2017లో SI ఉద్యోగానికి ఎంపికై శభాష్ అనిపించుకున్నారు.

Similar News

News March 10, 2025

చిత్తూరులో ముగ్గురిపై కేసు నమోదు

image

మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ముగ్గురు మహిళల చేత వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆదివారం రాత్రి పోలీసులు లాడ్జిపై దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News March 10, 2025

పుత్తూరు: చినరాజుకుప్పంలో హత్య

image

నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణ పరిధిలోని చినరాజుకుప్పం గ్రామానికి చెందిన మణికంఠ (29) అనే యువకుడు ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News March 10, 2025

అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి: ఎమ్మెల్యే భానుప్రకాశ్

image

రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని నగరి ఎమ్మెల్యే భానుప్రకాశ్ అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్ధ ‘రాస్‍’ ఆధ్వర్యంలో పుత్తూరులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళల అభివృద్ధి కోసం ‘రాస్‍’ సంస్ధ చేపట్టిన కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శనీయమన్నారు. మహిళా సాధికారత సాధ్యం కావాలంటే సాంఘిక, ఆర్థిక, అధికారాల పంపిణీ జరగాలన్నారు.

error: Content is protected !!