News July 6, 2024

పలమనేరు: బొత్సకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కౌంటర్

image

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఆవేశ పడకు బొత్సా అక్కడ ఉంది జగన్ కాదు చంద్రబాబు అని కౌంటర్ ఇచ్చారు. మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా అప్పన్నంగా ఏపీ భవనాలు అప్పగించింది మర్చిపోలేదని తెలిపారు. ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తామని చెప్పిన మాటలు మర్చిపోలేదని తెలిపారు.

Similar News

News December 10, 2025

చిత్తూరులో 12 మంది ఎస్ఐల బదిలీ

image

షేక్షావలి: సదుం TO వి.కోట
నాగసౌజన్య: NRపేట TO డీటీసీ
శివశంకర: సోమల TO చిత్తూరు మహిళా PS
సుబ్బారెడ్డి: రొంపిచెర్ల TO సీసీఎస్, చిత్తూరు
చిరంజీవి: తవణంపల్లె TO చిత్తూరు 1టౌన్
శ్రీనివాసులు: గుడుపల్లి TO సదుం
వెంకట సుబ్బయ్య: వెదురుకుప్పం TO వీఆర్
NOTE: VRలో ఉన్న శ్రీనివాసరావు(DTC), డాక్టర్ నాయక్(తవణంపల్లె), నవీన్ బాబు(వెదురుకుప్పం), పార్థసారథి(CCS), ఎన్.మునికృష్ణ(CCS)కు బాధ్యతలు అప్పగించారు.

News December 10, 2025

చిత్తూరు: కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవాలని వినతి

image

ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు వైసీపీ ఎంపీలు బుధవారం వినతిపత్రం అందజేశారు. రాజంపేట, తిరుపతి ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డి తదితరులు ఆమెకు వినతిపత్రం అందజేశారు. కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు.

News December 10, 2025

పలమనేరు-కుప్పం హైవేపై లారీ-RTC బస్సు ఢీ

image

పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని వీకోట(M) జీడీగుట్ట సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని RTC బస్సు ఢీకొనడంతో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి కుప్పం వస్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు జీడీగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని వెనకవైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కుప్పం PES, ఏరియా ఆసుపత్రికి తరలించారు.