News April 28, 2024

పలమనేరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. గంగవరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జీవరత్నం తన భార్యతో కలిసి పలమనేరు నుంచి తన స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా పలమనేరు వైపు వస్తున్న లగేజ్ ఆటో కంచిరెడ్డిపల్లి జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో జీవరత్నం అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను పలమనేరు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 11, 2025

CM సొంత నియెజకవర్గంలో గ్రానైట్ అక్రమ రవాణా.?

image

అది CM సొంత నియోజకవర్గం. అన్నిరంగాల్లో ముందుడాలని చంద్రబాబు అభివృద్ధి అంటుంటే.. ఆ పార్టీ నాయకులు మాత్రం అందినకాడికి దోచుకో.. దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారట. కుప్పం గ్రానైట్‌కు మంచి డిమాండ్ ఉంది. దీంతో నాయకులు పగలు గ్రావెల్ రాత్రిళ్లు గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారట. YCP హయాంలో చంద్రబాబు దీనిపై క్వారీలోకి వెళ్లి మరీ పరిశీంచారు. మరి ఇప్పటి అక్రమ రవాణాపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

News December 11, 2025

చిత్తూరు: మైనర్‌ బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

image

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4,100 జరిమానాను కోర్టు విధించినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు వెదురుకుప్పం(M) వెంగనపల్లెకు చెందిన మణి ఓ మైనర్ బాలికను ప్రేమించాలని వేధించాడు. 2020లో ఆమెను భయపెట్టి భాకరాపేటకు తీసుకువెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News December 11, 2025

చిత్తూరు కలెక్టర్‌కు 6వ ర్యాంకు

image

రాష్ట్రంలోనే అందరి కంటే ఎక్కువగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఎక్కువ ఫైల్స్ స్వీకరించారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 1,555 ఫైల్స్ తీసుకుని 1,421 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను ఒకరోజు 6గంటల వ్యవధిలోనే క్లియర్ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు మన కలెక్టర్‌కు రాష్ట్రంలో 6వ ర్యాంకు ఇవ్వగా.. 843 ఫైల్స్‌కు గాను 740 క్లియర్ చేయడంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్‌కు 12వ ర్యాంకు వచ్చింది.