News March 20, 2024

పలాస: అసభ్యకరంగా ప్రవర్తించిన డ్రైవర్ పై ఫిర్యాదు

image

జిల్లా కేంద్రం నుంచి పలాసకు వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ మంగళవారం సాయంత్రం ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా సెల్ఫోన్‌లో మాట్లాడుతూ.. ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, ప్రయాణికులు పలాస డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న మేనేజర్ మాట్లాడుతూ.. బస్సు విశాఖపట్నం డిపోకు చెందిందని, ఫిర్యాదును విశాఖపట్నానికి బదిలీ చేస్తానని ఫిర్యాదు దారునికి హామీ ఇచ్చారు.

Similar News

News March 14, 2026

ధాన్యం కొనుగోలుకు ఈనెల 28 లాస్ట్ డేట్: జేసీ

image

ప్రభుత్వ పరంగా రైతులు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈనెల 28 ఆఖరి తేదీ అని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు మీ ప్రాంతాల్లో గల రైతు సేవ కేంద్రాల్లో గల సిబ్బందిని లేదా మండల వ్యవసాయ శాఖ అధికారిని పైన తెలిపిన తేదీలోగా సంప్రదించాలని ఆయన తెలిపారు.

News March 14, 2026

ధాన్యం కొనుగోలుకు ఈనెల 28 లాస్ట్ డేట్: జేసీ

image

ప్రభుత్వ పరంగా రైతులు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈనెల 28 ఆఖరి తేదీ అని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు మీ ప్రాంతాల్లో గల రైతు సేవ కేంద్రాల్లో గల సిబ్బందిని లేదా మండల వ్యవసాయ శాఖ అధికారిని పైన తెలిపిన తేదీలోగా సంప్రదించాలని ఆయన తెలిపారు.

News March 13, 2026

16 నుంచి ఒంటిపూట బడులు: డీఈఓ

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 16వ తేదీ సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఆదేశాలు జారీచేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాన్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల పాఠశాలల్లో మధ్యాన్నం 1 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.