News June 20, 2024
పలాస పాసింజర్ గమ్యం కుదింపు

పూండి-నౌపడా సెక్షన్ మధ్యలో జరుగుతున్న భద్రత పనుల దృష్ట్యా నేడు పలాన పాసింజర్ గమ్యం కుదించినట్లు అధికారులు తెలిపారు. పలాస-విశాఖపట్నం (07471) పాసింజర్ స్పెషల్ గురువారం పలాస నుంచి కాకుండా శ్రీకాకుళం రోడ్ నుంచి బయల్దేరనుంది. అలాగే విశాఖపట్నంలో బయల్దేరే విశాఖపట్నం-పలాస(07470) పాసింజర్ స్పెషల్ పలాస వరకు కాకుండా శ్రీకాకుళం రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది.
Similar News
News November 30, 2025
శ్రీకాకుళం: ’65 హాట్స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి’

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు అధికారులు గుర్తించిన 65 హాట్స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమవేశం నిర్వహించారు. కెమెరాల ఏర్పాటు బాధ్యతను స్థానిక సంస్థలు తీసుకోవాలని చెప్పారు.
News November 30, 2025
అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.
News November 30, 2025
అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.


