News January 17, 2025
పలాస: సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతు

పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన జంగం తరుణ్(16) శుక్రవారం సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. బయటకు రాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండగ సెలవులకు సరదాగా గడుపుతున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమని స్థానికులు అన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News April 17, 2026
ఎచ్చెర్ల: చేపల వేటకు బ్రేక్.. తీరాల్లో నిశ్శబ్దం!

చేపల వేటపై రెండు నెలల నిషేధం అమల్లోకి రావడంతో జిల్లాలోని సముద్ర తీరాలు నిర్మానుష్యంగా మారాయి. ఎచెర్ల మండలంలోని డి.మత్స్యలేశం గ్రామంలో మత్స్యకారులు బోట్లను, వలలను ఒడ్డున సురక్షితంగా ఉంచి ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది చేపల ప్రత్యుత్పత్తి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
News April 17, 2026
శ్రీకాకుళం జిల్లాలో 18న జాబ్ మేళా

జాబ్ మేళా వివరాలు ఇవే:
మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్, ఐ స్మార్ట్ సొల్యూషన్స్, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్లో పని చేసేందుకు ఇంటర్, ఐటీఐ, డిప్లోమో, ఆపై చదివి ఉండాలన్నారు. పోస్టుల మేరకు 18-35 ఏళ్లు కలిగి ఉండాలన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో పనిచేయాలన్నారు. రూ.8-35 వేల జీతం ఇవ్వనున్నారు.
News April 17, 2026
శ్రీకాకుళం జిల్లాలో 18న జాబ్ మేళా

జాబ్ మేళా వివరాలు ఇవే:
మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్, ఐ స్మార్ట్ సొల్యూషన్స్, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్లో పని చేసేందుకు ఇంటర్, ఐటీఐ, డిప్లోమో, ఆపై చదివి ఉండాలన్నారు. పోస్టుల మేరకు 18-35 ఏళ్లు కలిగి ఉండాలన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో పనిచేయాలన్నారు. రూ.8-35 వేల జీతం ఇవ్వనున్నారు.


