News March 28, 2025

పలిమెల: అగ్నివీర్‌ ఎంపికైన రాకేశ్ 

image

పలిమెల మండలం పంకెనకు చెందిన బొచ్చు లక్ష్మయ్య- పుష్పలతల కుమారుడు రాకేశ్ ఇటీవల ప్రకటించిన అగ్ని వీర్ ఆర్మీ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి, మెరిట్ లిస్టులో ఆర్మీ జనరల్ డ్యూటీ క్యాటగిరిలో ఎంపికయ్యాడు. రాకేశ్ మాట్లాడుతూ.. తప తల్లిదండ్రులు నిరంతరం కష్టపడుతూ తనను చదివించారని, వారి కృషి వల్లనే ఉద్యోగం సాధించానని తెలిపాడు. 

Similar News

News November 24, 2025

మంచిర్యాల: ఓటు వేయడానికి రెడీనా..!

image

మంచిర్యాల జిల్లాలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఈ విధంగా కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 306 గ్రామపంచాయతీలు, 2,680 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు 65, ఎస్సీ 81, బీసీ 23, జనరల్ 137 స్థానాలు కేటాయించారు. డిసెంబర్ రెండో వారంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు.

News November 24, 2025

పాలమూరు: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

image

నారయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్‌లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దాదాపు 4గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యేపై అని మాగునూరు పోలీసులు ఆయనతోపాటు బీఆర్ఎస్ నేతలు పలువురిపై కేసు నమోదు చేశారు.

News November 24, 2025

NGKL: జిల్లాలో గత ఐదు రోజులుగా తగ్గిన చలి..!

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత ఐదు రోజులుగా చల్లి తీవ్రత తగ్గుతుంది. చారకొండ మండలం సిర్సనగండ్లలో 18.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లి, అమ్రాబాద్ 18.7, వెల్దండ 18.8, ఎంగంపల్లి 19.0, తెలకపల్లి, కొండారెడ్డిపల్లి 19.1, నాగర్‌కర్నూల్, బిజినేపల్లి 19.3, కుమ్మెర 19.5, ఊర్కొండ 19.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.