News December 4, 2024

పలు మెట్రో రైళ్లు మెట్టుగూడ వరకే..!

image

HYDలో మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో మెట్రో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు డైరెక్ట్ మెట్రో సేవలకు బదులుగా, రాయదుర్గం నుంచి మెట్టుగూడ వరకు పలు రైళ్లను నడుపుతోంది. మెట్టుగూడ నుంచి తిరిగి రిటర్న్ రాయదుర్గం వెళ్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News January 18, 2025

HYD: సినిమా ఛాన్స్ అంటూ యువతిపై లైంగిక దాడి

image

సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన బాధితురాలి ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మీద BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

News January 18, 2025

HYD: త్వరలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు: KTR

image

త్వరలో చేవెళ్ల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. చేవెళ్లతో పాటుగా పార్టీ మారిన 10 ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతాయని, ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేంత వరకు BRS పార్టీ నిర్విరామంగా పోరాడుతుందని KTR అన్నారు. కాగా, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య BRS నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

News January 18, 2025

HYD: రాష్ట్రంలో రేవంత్ దోపీడీ ముఠా: కేటీఆర్

image

రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపీడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రగతి భవన్‌లో చిట్ చాట్‌లో KTR మాట్లాడుతూ.. రేవంత్ సోదరులతో పాటు ఆరుగురి టీం కంపెనీల నుంచి వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడని అన్నారు. తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోనిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డితో కూడిన ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణలో తిరుగుతుందని అన్నారు.