News March 18, 2025

పల్నాటి యుద్ధం ఎందుకు జరిగింది?

image

పల్నాటి చరిత్ర పై విస్తృత చర్చ జరగాలని వక్తలు ఉద్ఘాటించారు. గామాలపాడులో పల్నాటి నాగమ్మ శైవ క్షేత్రం పునః ప్రతిష్ఠ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 11వ శతాబ్దం నాటి పల్నాడు చరిత్రలో బ్రహ్మనాయుడు వైష్ణవ భక్తుడు కాగా, నాగమ్మ శైవ భక్తురాలు. అప్పట్లో శైవం, వైష్ణం, సంప్రదాయం, సంస్కరణల మధ్య యుద్ధం అని కొందరు అంటుంటారు. దాయాదుల పోరుగా కొందరు అభివర్ణిస్తున్నారు. మీరేమంటారు కామెంట్ చేయండి.

Similar News

News November 20, 2025

ఖమ్మం: నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

image

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు CCTV ఇన్స్టాలేషన్, బ్యూటీషియన్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు ఫ్రీగా కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News November 20, 2025

HYD: అర్ధరాత్రి రోడ్లపై తిరిగిన ముగ్గురి యువకుల అరెస్ట్

image

అర్ధరాత్రి రోడ్లపై కారణం లేకుండా తిరుగుతున్న ముగ్గురు యువకులను టోలీచౌకీ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులపై పెట్టీ కేసులు నమోదు చేసి, వారిని 3 – 7 రోజుల రిమాండు విధించారు. ఇకనుంచి ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్లపై తిరగకూడదని ప్రజలను హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు హెచ్చరించారు.

News November 20, 2025

భిక్కనూర్: బొట్టు పెట్టి చీరలు అందజేయాలి: మంత్రి

image

భిక్కనూర్‌లో గురువారం మంత్రి సీతక్క ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించారు. ప్రతి లబ్ధిదారురాలికి తప్పనిసరిగా చీర అందేలా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, చీరలను గౌరవప్రదంగా అందజేయాలని సూచించారు.