News February 18, 2025
పల్నాడులో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి..

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ ధరలు దిగొస్తున్నాయి. కాగా పల్నాడు జిల్లాలో ధరలపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో రూ.50- రూ.100 మేర ధర పడిపోగా జిల్లాలో రూ.30 మేర మాత్రమే తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.230లు, స్కిన్తో రూ. 210లుగా ఉంది. గతవారం కేజీ రూ.260-280 వరకు ఉంది. మరోవైపు మటన్ ధర రూ.900 వద్ద నిలకడగా కొనసాగుతుంది. 100గుడ్లు రూ.420 వరకు అమ్ముతున్నారు.
Similar News
News November 24, 2025
1.4 కోట్ల కుటుంబాలకు ఫ్యామిలీ కార్డులు: CM

AP: రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంను అమలు చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 1.4 కోట్ల కుటుంబాలకు 2026 జూన్ నాటికి QR కోడ్తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని సూచించారు. ఆధార్, కుల ధ్రువీకరణ, రేషన్ కార్డు , స్కాలర్షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలన్నారు.
News November 24, 2025
పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గురించి మీకు తెలుసా..?

పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జిల్లాలో అభివృద్ధి కార్యకలాపాలను అమలు చేయడానికి 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంస్థ 7281.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 21,36,660 జనాభాను కలిగి ఉంది. పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ పరిధిలో 28 మండలాల్లోని 349 గ్రామాలు, 8 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా చిరుమామిళ్ల మధుబాబును ప్రభుత్వం ఇటీవల నియమించింది.
News November 24, 2025
TAKE A BOW.. 93 రన్స్, 6 వికెట్లు

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ అదరగొట్టారు. తొలి ఇన్నింగ్సులో 8వ స్థానంలో వచ్చిన అతడు 91 బంతుల్లోనే 93 రన్స్ చేశారు. ఏకంగా 7 సిక్సర్లు బాదారు. దీంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయగలిగింది. అటు బౌలింగ్లో 6 కీలక వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు. చక్కటి బౌన్సర్లతో మనోళ్లను ముప్పుతిప్పలు పెట్టారు.


