News February 18, 2025
పల్నాడులో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి..

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ ధరలు దిగొస్తున్నాయి. కాగా పల్నాడు జిల్లాలో ధరలపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో రూ.50- రూ.100 మేర ధర పడిపోగా జిల్లాలో రూ.30 మేర మాత్రమే తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.230లు, స్కిన్తో రూ. 210లుగా ఉంది. గతవారం కేజీ రూ.260-280 వరకు ఉంది. మరోవైపు మటన్ ధర రూ.900 వద్ద నిలకడగా కొనసాగుతుంది. 100గుడ్లు రూ.420 వరకు అమ్ముతున్నారు.
Similar News
News April 15, 2026
1,250 మెకనైజడ్ బోట్లను ఇవ్వాలనుకున్నాం: YS జగన్

తాము జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 1,250 మెకనైజడ్ బోట్లకు సదుపాయం కలిగేలా నిర్మాణం చేపట్టామని మాజీ CM జగన్ అన్నారు. ఆ బోట్లను కేవలం 10% మత్స్యకారులు కట్టుకుంటే, 40% రాయితీ ఇచ్చి, మిగిలిన దాన్ని లోన్ రూపంలో అందించే వాళ్లమన్నారు. అదే జరిగితే ఇప్పటికి 15 మంది మత్స్యకారులు ఆ బోట్లకు యజమానులై ఉండేవారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు నడిచేవని, బోట్ల రిపేరు యూనిట్లు పనిచేసేవన్నారు.
News April 15, 2026
మూడు జిల్లాల్లో 4 వేలకు పైగా స్లాట్ బుకింగ్స్

మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గత నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ల కోసం 4 వేలకుపైగా స్లాట్ బుకింగ్స్ నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగడం, ఆస్తుల కొనుగోలు విక్రయాలు అధికమవడం దీనికి కారణంగా అధికారులు తెలిపారు. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానం వల్ల పారదర్శకత పెరిగి, ప్రజలకు సులభంగా సేవలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరుగుదల ఉండొచ్చని అంచనా వేశారు.
News April 15, 2026
శ్రీకాకుళం: కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో 87.82 శాతం ఉత్తీర్ణత

శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం 772 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 678 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సమగ్ర శిక్ష జిల్లా ఏపీసీ పి.వేణుగోపాలరావు బుధవారం తెలిపారు. 87.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. అత్యధికంగా 978 మార్కులు వచ్చాయని అన్నారు. నాలుగు కేజీబీవీలు శత శాతం ఫలితాలు సాధించాయని చెప్పారు.


