News February 15, 2025
పల్నాడులో బర్డ్ ఫ్లూ లేదు: కాంతారావు

జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడం లేదని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కాంతారావు తెలిపారు. కోళ్ల ఫారాలను పశుసంవర్ధక శాఖ సిబ్బంది సందర్శించి సంబంధిత యజమానులకు బయో సేఫ్టీ, బయో సెక్యూరిటీ విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 28 రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల రవాణా విషయంలో చెక్ పోస్ట్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు.
Similar News
News March 9, 2026
NZB: మినీ సరస్ మేళాను సందర్శించిన డీఎంహెచ్ఓ

నిజామాబాద్లో నిర్వహిస్తున్న ‘మినీ సరస్ మేళా-2026’ను జిల్లా ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా.బి.రాజశ్రీ సందర్శించారు. గ్రామీణ చేతివృత్తి కళాకారులు, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె ఆసక్తిగా తిలకించారు. హస్తకళ నైపుణ్యంతో తయారైన వస్తువులను పరిశీలించారు. ఈ ప్రదర్శన ఎంతో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా గ్రామీణ సంస్కృతిపై అవగాహన కల్పించేలా ఉందని ఆమె కొనియాడారు.
News March 9, 2026
‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్లో పాల్గొనాలని అనుకునేవారు <
News March 9, 2026
బిన్ ఫ్రీ HYD.. చెత్తంతా ఖాళీ ప్లాట్లలోనే

నగరాన్ని GHMC, CMC, MMC కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది అవార్డుల కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. HYD బిన్ ఫ్రీ అయిందని ఆఫీసర్లు ఢిల్లీకి రిపోర్టులు పంపుతున్నారని టాక్. కానీ, గల్లీల్లోకి వస్తే అసలు రంగు బయట పడుతుందన్నది ప్రజల మాట. టాప్ ర్యాంక్ వస్తే ‘మేమే NO.1’ అని చెప్పుకోవచ్చనేది ప్లాన్గా తెలుస్తోంది. దీంతో కేంద్రాన్ని మెప్పించినా, రోజూ ఆ దుర్వాసన పీల్చే జనాల్ని ఎలా నమ్మిస్తారనేది ప్రశ్న.


