News March 19, 2025
పల్నాడులో రాజకీయ ఆసక్తి రేపుతున్న మర్రి రాజీనామా

YCPకి MLC మర్రి రాజశేఖర్ రాజీనామా చర్చనీయాంశమైంది. 2004లో చిలకలూరిపేటలో ఇండిపెండెంట్గా గెలిచిన ఆయన 2010లో YCPలో చేరారు. 2014లో MLAగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం YCP జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2018లో జగన్ పాదయాత్రలో కీలకంగా పనిచేశారు. కాగా 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా విడదల రజనీ ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేదని ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.
Similar News
News March 22, 2025
IPL: ఆ రికార్డు బ్రేక్ చేసేదెవరో?

నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో కొన్ని రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు(175), అత్యధిక సిక్సర్లు(357) విధ్వంసకర బ్యాటర్ గేల్ పేరిట ఉన్నాయి. సిక్సర్ల రికార్డుకు ఇతర ఆటగాళ్లు చాలా దూరంలో ఉన్నా అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడున్న ప్లేయర్లలో ఏ ఆటగాడు ఆ రికార్డు బ్రేక్ చేస్తారని భావిస్తున్నారు? COMMENT.
News March 22, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి రూ.1.20 లక్షల ఫైన్

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట సీఐ YRK శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. శుక్రవారం జగ్గంపేట ఎస్సై రఘునాథరావు, గండేపల్లి ఎస్సై శివ నాగబాబు చేపట్టిన ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 17 మంది పట్టుపడ్డారు. వీరిని కోర్టులో హాజరు పరచగా 12 మందికి రూ.10 వేల చొప్పున ఫైన్ విధించినట్లు సీఐ తెలిపారు.
News March 22, 2025
నారాయణపేట జిల్లాలో దారుణం.. భర్తను చంపిన భార్య

భూ వివాదం కారణంగా భర్తను భార్య చంపేసిన ఘటన నర్వలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లంకల గ్రామానికి చెందిన పాలెం అంజన్న(41) NRPT జిల్లాలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్య కొంత భూమిని అమ్మగా, మిగిలిన భూమి తన పేరుపై చేయలేదని కోపంతో భర్త మెడకు తాడు బిగించి చంపింది. రంగమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి అక్క పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని SI కురుమయ్య తెలిపారు.