News February 13, 2025
పల్నాడులో లెదర్ పార్క్ ఏర్పాటు: ఎంపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739444002308_52098404-normal-WIFI.webp)
పల్నాడు జిల్లాలో లెదర్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని ఎంపీ కృష్ణదేవరాయలు మంత్రి టీజీ భరత్ను కలిసి గురువారం విజ్ఞప్తి చేశారు. ఏపీఐఐసీ భవంతిలో ఎంపీ మాట్లాడుతూ.. లెదర్ పార్క్ స్థల పరిశీలన విషయాలను, ప్రాజెక్టుతో కలిగే లబ్ధిని, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాల గురించి వివరించారు. లెదర్ పార్కును ఏర్పాటు చేసేందుకు పల్నాడులో ఉన్న వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను విదేశీ ప్రతినిధి బృందానికి ఎంపీ తెలిపారు.
Similar News
News February 14, 2025
బిచ్కుంద: బస్టాండ్ ఆవరణలో వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739457672237_20551658-normal-WIFI.webp)
బిచ్కుంద బస్టాండ్ ఆవరణలో పుల్కల్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అక్కడికి చేరుకుని పరిశీలించి చూడగా మద్యం సేవించి ఉన్న సమయంలో ఫిట్స్ వచ్చాయని స్థానికులు చెప్పినట్లు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 14, 2025
జగిత్యాల: బావిలో మృతదేహం.. అడ్రస్ లభ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739445943938_60417652-normal-WIFI.webp)
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో మృతిచెందిన వ్యక్తి అడ్రసును పోలీసులు గురువారం మధ్యాహ్నం గుర్తించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన జక్కని సాయికుమార్ (30)గా గుర్తించినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. సాయికుమార్ తన అత్తగారి ఊరైన పోసానిపేట గ్రామానికి ఐదు రోజుల క్రితం వచ్చి వెళ్లాడు. అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు.
News February 14, 2025
MBNR: సర్వం సిద్ధం.. నేడు షబ్-ఎ-బరాత్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739453687549_19518427-normal-WIFI.webp)
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా “షబ్-ఎ-బరాత్”కు ముస్లింలు అన్ని మస్జిద్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. షాబాన్ నెలలో 15వ(నేడు) రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ ఆరాధనలు చేస్తూ, తమ కోసం, తమ ప్రియమైనవారి కోసం అల్లాహ్ దయను కోరుతూ గడుపుతారు. షబ్-ఎ-బరాత్ను క్షమాపణ రాత్రి లేదా ప్రాయశ్చిత్త దినం అని కూడా పిలుస్తారు.