News February 27, 2025
పల్నాడులో 30 శాతం పోలింగ్ నమోదు

పల్నాడు జిల్లాలో గురువారం కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో మధ్యాహ్నం 12 గంటలకు 30 శాతం పోలింగ్ నమోదైంది. వారిలో పురుషులు 11,942 మంది, మహిళలు 5,387 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రాన్స్ జెండర్స్ ఎవరు ఓటింగ్కు రాలేదు. జిల్లాలో మొత్తంగా 30 శాతం ఓటింగ్ నమోదు కాగా 17,329 మంది పట్టభద్రులు తమ ఓట్లు వేశారు. కలెక్టర్ అరుణ బాబు పోలింగ్ను పరిశీలిస్తున్నారు.
Similar News
News November 24, 2025
కాళోజీ యూనివర్సిటీలో విజిలెన్స్ తనిఖీలు

డబ్బులు తీసుకొని <<18373249>>మార్కులు కలిపారంటూ వచ్చిన కథనాల<<>>పై విజిలెన్సు అధికారులు కదిలారు. WGL కాళోజీ హెల్త్ యూనివర్సిటీ PG పరీక్షల రీకౌంటింగ్లో జరిగిన అవకతవకలపై ఎగ్జామినేషన్ బ్రాంచ్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో విజిలెన్సు అధికారులు ఎగ్జామినేషన్ విభాగంలోని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎవరి లాగిన్లో ఈ అక్రమాలు జరిగాయో అధికారుల తనిఖీ అనంతరం బయటపడే అవకాశం ఉంది.
News November 24, 2025
అపరిచితులకు మీ వివరాలు ఇవ్వొద్దు: పోలీసులు

కేవలం 5 నిమిషాల్లో లోన్ వస్తుందనే మాటల్ని నమ్మి, అపరిచితులకు మీ వివరాలు ఇవ్వద్దని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్బీఐ అనుమతి లేని యాప్స్ను ఇన్స్టాల్ చేయొద్దని, వాటి నుంచి లోన్ తీసుకోవద్దని, ఎవరికి ఆన్లైన్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపించొద్దని పోలీసులు ప్రజలకు సూచనలు చేశారు.
News November 24, 2025
నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర ఆరోగ్యం విషమించింది. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఈక్రమంలోనే అంబులెన్స్ ఆయన ఇంటికి చేరుకుంది. అటు బంధువులు, బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్ర ఇంటికి వెళ్తున్నారు.


