News February 27, 2025
పల్నాడులో 30 శాతం పోలింగ్ నమోదు

పల్నాడు జిల్లాలో గురువారం కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో మధ్యాహ్నం 12 గంటలకు 30 శాతం పోలింగ్ నమోదైంది. వారిలో పురుషులు 11,942 మంది, మహిళలు 5,387 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రాన్స్ జెండర్స్ ఎవరు ఓటింగ్కు రాలేదు. జిల్లాలో మొత్తంగా 30 శాతం ఓటింగ్ నమోదు కాగా 17,329 మంది పట్టభద్రులు తమ ఓట్లు వేశారు. కలెక్టర్ అరుణ బాబు పోలింగ్ను పరిశీలిస్తున్నారు.
Similar News
News November 26, 2025
సింహాచలం ఆలయ ప్రతిష్ఠ మసకబారింది: గంటా

గత వైసీపీ హయాంలో సింహాచలం దేవాలయాన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మార్చారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తాలూకా అవశేషాలు దేవస్థానంలో ఇంకా ఉన్నాయన్నారు. ఉద్యోగ వ్యవహారాలు, విరాళాలు, బంగారు ఆభరణాల లెక్కలు.. ఇలా అనేక అంశాల్లో వస్తున్న ఆరోపణలు ఆలయ ప్రతిష్ఠను మసక బారుస్తున్నాయని అన్నారు.
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికల కోసం మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా డిసెంబర్లో నిర్వహించే సర్పంచ్ ఎన్నికల కోసం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మీడియా కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ తిరుమల పాల్గొన్నారు.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.


