News March 1, 2025

పల్నాడు: ఇంటర్ పరీక్షలకు 759 మంది గైర్హాజరు

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా శనివారం 48 పరీక్ష కేంద్రాలలో ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 17,313 మందికి గాను 16,554 మంది విద్యార్థులు హాజరయ్యారు. 759 మంది హాజరు కాలేదు. 95.62 హాజరు శాతంగా జిల్లా అధికారి నీలావతి తెలిపారు. ఒకేషనల్ కు సంబంధించి 1,168 మంది గాను 1,037 మంది హాజరయ్యారని, మొత్తంగా ఇంటర్ పరీక్షల హాజరు శాతం 95.18గా నమోదైనట్లు పేర్కొన్నారు.

Similar News

News March 3, 2025

గంగవరం: ప్రేమ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

image

ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని గంగారం మండలం జంగాలపల్లికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. SI రవి కుమార్ వివరాలు.. కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో ఆమెతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

News March 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 3, 2025

విశాఖలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నగర పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొని, పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. రౌడీ షీటర్ల మీద నిత్యం పోలీసుల నిఘా ఉంటుందన్నారు.

error: Content is protected !!