News February 20, 2025

పల్నాడు: ఎమ్మెల్సీ ఓటును చెక్ చేసుకోండి ఇలా..

image

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదైన వ్యక్తులు తమ ఓటు ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా <>https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html<<>> లింక్‌ను ఓపెన్ చేయాలి. రైట్ సైడ్‌లో MLC Registration 2024ను క్లిక్ చేస్తే 4 ఆప్షన్లు వస్తాయి. అందులో Search Your Name క్లిక్ చేసిన తర్వాత గ్రాడ్యుయేట్ కృష్ణా/గుంటూరు క్లిక్ చేసి Application ID/Name/ ఇంటి నంబర్ మూడింటిలో ఒకటి ఎంచుకుంటే పూర్తి వివరాలు వస్తాయి.

Similar News

News November 24, 2025

సిద్దిపేట: మొక్క రైతులకు డబ్బులు ఎప్పుడిస్తారో..?

image

సిద్దిపేట జిల్లా రైతులు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాల్లో 86 వేల క్వింటాళ్ల మొక్కజొన్నను క్వింటాలుకు రూ. 2,400 ధరకు ప్రభుత్వం సేకరించింది. అయితే కొనుగోలు జరిగి నెల దాటినా సొమ్ము జమ కాలేదు. దీంతో పెట్టుబడులు చెల్లించేందుకు డబ్బులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు ఎప్పుడు జమ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

News November 24, 2025

ప్రొద్దుటూరు: బంగారు వ్యాపారి బాధితులు ఎందరో..?

image

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి తనిగంటి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తున్నారు. వ్యాపారంలో మోసం చేసి తమను బయటికి గెంటేశారని మరదలు పద్మజ ఫిర్యాదు చేశారు. HYD హేమంత్ శర్మ, మార్వాడి షమీర్, JMD సంధ్య, BDVL శ్రావణి, లేఖ ఇలా ఎందరో తమకు బంగారం బాకీ ఉన్నాడంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చట్ట విరుద్ధంగా స్కీం, చీటీల వ్యాపారంలో మోసం చేశాడంటూ బాధితులు వాపోతున్నారు.

News November 24, 2025

మెనోపాజ్‌లో ఎముకలు జాగ్రత్త

image

ప్రతి స్త్రీ జీవితంలో మెనోపాజ్ స్థితి ఒకటి. అయితే ఈ క్రమంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా క్యాల్షియం, డి విటమిన్‌ లోపాలు ఎముకల్ని బలహీనంగా మారుస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి మెనోపాజ్‌ దశలో స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో సుమారు 1200 మి.గ్రా క్యాల్షియంను అదనంగా తీసుకోవాలి. అలానే, పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే డైట్‌ని తీసుకోవాలంటున్నారు.