News February 20, 2025

పల్నాడు: ఎమ్మెల్సీ ఓటును చెక్ చేసుకోండి ఇలా..

image

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదైన వ్యక్తులు తమ ఓటు ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా <>https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html<<>> లింక్‌ను ఓపెన్ చేయాలి. రైట్ సైడ్‌లో MLC Registration 2024ను క్లిక్ చేస్తే 4 ఆప్షన్లు వస్తాయి. అందులో Search Your Name క్లిక్ చేసిన తర్వాత గ్రాడ్యుయేట్ కృష్ణా/గుంటూరు క్లిక్ చేసి Application ID/Name/ ఇంటి నంబర్ మూడింటిలో ఒకటి ఎంచుకుంటే పూర్తి వివరాలు వస్తాయి.

Similar News

News November 25, 2025

NPDCL కరీంనగర్ సర్కిల్ POగా మునీందర్

image

NPDCL KNR సర్కిల్ ఇన్‌ఛార్జ్ పీవోగా S.మునీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పీవోగా పనిచేసిన B.చంద్రయ్యకు అసిస్టెంట్ సెక్రటరీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో పోస్టింగ్ ఇస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో PO పోస్టుకు ఖాళీ ఏర్పడడంతో మునీందర్‌కు ఇన్‌ఛార్జ్ పీవోగా బాధ్యతలు అప్పగించారు. ఒక ADEకి DEగా, 10 మంది ఏఈలకు ADEలుగా, 5 మంది సబ్ ఇంజినీర్లకు ఏఈలుగా పదోన్నతి కల్పించారు.

News November 25, 2025

ఏనుగుల సంచార ప్రాంతం ‘వలియాన వట్టం’

image

శబరిమల యాత్రలో కరిమల కొండను దిగిన తర్వాత భక్తులు చేరే ప్రాంతమే వలియాన వట్టం. ఇది చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇతర వన్యమృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. భద్రత దృష్ట్యా, చీకటి పడే సమయానికి స్వాములు ఈ ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ దారి రాత్రిపూట ప్రయాణానికి సురక్షితం కాదు. <<-se>>#AyyappaMala<<>>

News November 25, 2025

ఉంగుటూరు: సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల డిసెంబర్ 1న ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఉంగుటూరు నియోజకవర్గంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో, సీఎం పాల్గొనే సభ ప్రాంగణాన్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్ వెట్రిసెల్వి, స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు మంగళవారం ప్రాంతాన్ని పరిశీలించారు.