News April 4, 2024
పల్నాడు: ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్

పల్నాడు జిల్లా ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ నియమితులయ్యారు. కాగా ఈయన గతంలో పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన బిందుమాధవ్ పశ్చిమగోదావరి జిల్లా గ్రేహౌండ్స్, రంపచోడవరంలో అసిస్టెంట్ ఎస్పీగా, ఎస్ఈబీ గుంటూరు రూరల్ జిల్లా జాయింట్ డైరెక్టర్ గా పనిచేశారు.
Similar News
News March 15, 2026
ANU: సజావుగా దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో MBA, MCA ప్రవేశ పరీక్ష ఆదివారం సజావుగా జరిగినట్లు CDE వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ANUలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాలలో 736 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని 670 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. ఈ నెల 17న సాయంత్రం ఫలితాలను విడుదల చేస్తామన్నారు.
News March 15, 2026
జిల్లాలో 10 పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు: ఆర్జేడీ

10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు పరిధిలోని 17 పరీక్షా కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి ఆదివారం తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
News March 15, 2026
సమస్యల పరిష్కారానికి ‘మీకోసం’ వెబ్సైట్: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు కేవలం ప్రత్యక్షంగానే కాకుండా ‘మీకోసం’ వెబ్సైట్ ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించే PGRS, రెవెన్యూ క్లినిక్ సేవలను నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఆన్లైన్ వేదికల ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.


