News March 12, 2025

పల్నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

image

స్థానిక పల్నాడు కలెక్టరేట్ వద్దకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. యువత పోరులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, శ్రేణులతో కలిసి కలెక్టరేట్ లో వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Similar News

News January 2, 2026

ఈడుపుగల్లుకు రైలు కూత.. 49 కి.మీ కొత్త రైల్వే లైన్

image

తరిగొప్పుల-దుగ్గిరాల మధ్య ప్రతిపాదిత 49k.m కొత్త రైల్వే లైన్‌లో ఈడుపుగల్లు రైల్వేస్టేషన్ కేంద్రంగా మారనుంది. లొకేషన్ సర్వే, మట్టి నమూనాల పరిశీలన పూర్తికావడంతో భూసేకరణ, ట్రాక్‌, స్టేషన్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. తరిగొప్పుల నుంచి చీలి, మంతెన దక్షిణంగా రైవాస్ కాలువ మీదుగా ఈడుపుగల్లు,వణుకూరు వైపు ట్రాక్‌ వెళ్లనుంది. చోడవరం వద్ద రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికీ కసరత్తు సాగుతోంది.

News January 2, 2026

పిల్లలను పెంచలేక.. ఎవరూ ఆదరించక!

image

ముగ్గురు పిల్లలకు తండ్రి సురేంద్ర విషం ఇచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. భార్య మరణంతో ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడగా, పిల్లల ఆలనాపాలనా చూసేందుకు ఎవరూ సాయం చేసేవారు కారట. కూలికి వెళ్తేగాని పూట గడవకపోవడం, పిల్లలను చూసుకోవడం భారంగా భావించే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. <<18730785>>తుడుమలదిన్నెలో<<>> జరిగిన అంత్యక్రియలకు సురేంద్ర బంధువులు, భార్య తల్లిదండ్రులు రాకపోవడం విచారకరం.

News January 2, 2026

కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రాక.. అభివృద్ధికి బాట!

image

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఆంజనేయ స్వామి వెలసిన కొండపై నిద్రిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవనే నమ్మకంతో వచ్చే భక్తులకు, కొండపైకి చేరుకోగానే సరైన గదులు లేక ఆలయ పరిసరాల్లో నేలపై నిద్రిస్తూ అవస్థలు పడ్డారు. భక్తుల మొర ఆలకించిన పవన్ 96 గదుల సత్ర నిర్మాణానికి శనివారం భూమి పూజ చేయనున్నారు. దీంతో భక్తుల కష్టాలు తీరనున్నాయి.