News March 12, 2025

పల్నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

image

స్థానిక పల్నాడు కలెక్టరేట్ వద్దకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. యువత పోరులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, శ్రేణులతో కలిసి కలెక్టరేట్ లో వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Similar News

News March 13, 2025

ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

డిగ్రీ పాసైన BC అభ్యర్థులకు బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో ఫ్రీ ట్రైనింగ్,ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా BC అభివృద్ధి అధికారి రాజలి,స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తారన్నారు.అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఏజ్ లిమిట్-26లోపు.లాస్ట్ డేట్-ఏప్రిల్ 8. SHARE IT

News March 13, 2025

డిజిటల్ మోసాల్లో 83,668 వాట్సాప్ అకౌంట్లు బ్లాక్: బండి

image

డిజిటల్ అరెస్ట్ స్కాముల్లో 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు హోంశాఖ వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీ అధికారులుగా నటిస్తూ మోసాలకు పాల్పడినట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ డీఎంకే ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటివరకు సైబర్ నేరాలపై 13.36 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని చెప్పారు. సుమారు రూ.4,386 కోట్ల నష్టాన్ని నివారించినట్లు తెలిపారు.

News March 13, 2025

సిద్దిపేట: ఘోర రోడ్డ ప్రమాదం వ్యక్తి మృతి

image

సిద్దిపేట జిల్లా నర్సంపేట కెనాల్ వద్ద జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. నర్సంపేట గ్రామానికి చెందిన వనం రాజు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!