News March 12, 2025
పల్నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

స్థానిక పల్నాడు కలెక్టరేట్ వద్దకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. యువత పోరులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, శ్రేణులతో కలిసి కలెక్టరేట్ లో వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Similar News
News February 8, 2026
జీడిమామిడిలో ‘టి దోమ’ను ఎలా నివారించాలి?

చెట్లు చిగురించినప్పుడు తొలిసారి లీటరు నీటికి ల్యాండా సైహాలోత్రిన్ 0.6ML లేదా ఎసిటామాప్రిడ్ 0.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. 2,3 వారాల తర్వాత లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.6ML లేదా ప్రొఫెనోఫాస్ 1.5ML కలిపి పిచికారీ చేయాలి. కాయలు గోళీకాయ సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి ల్యాండా సైహాలోత్రిన్ 0.6ML లేదా ప్రొఫెనోఫాస్ 1.5ML కలిపి పిచికారీ చేయాలి. వీటికి వేపనూనెను తగిన మోతాదులో కలిపితే మంచిది.
News February 8, 2026
ఉదయమా? సాయంత్రమా? ఎక్సర్సైజ్కు బెస్ట్ టైమ్ ఏది?

ఎక్సర్సైజ్ ఏ టైమ్లో చేసినా మంచిదే. కానీ చేసే సమయాన్ని బట్టి ఫలితాల్లో మార్పు ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. సాయంత్రం 4-8 గంటల మధ్య కండరాల సామర్థ్యం పీక్లో ఉండి బెస్ట్ పెర్ఫార్మెన్స్కు వీలవుతుంది. స్త్రీలు ఉదయం పూట వర్కవుట్ చేస్తే పొట్ట కొవ్వు, BP తగ్గుతాయి. అదే పురుషులకు సాయంత్రం వేళ వ్యాయామం వల్ల BP కంట్రోల్లో ఉంటుంది. అయితే రోజూ ఒకే సమయంలో ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.
News February 8, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు

విద్యాశాఖ ఆదేశాల మేరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు ఈనెల 9 తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని డీఈవో ఏ రవిబాబు తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం డీఈవో కార్యాలయంలో ఆయన ప్రకటన విడుదల చేస్తూ ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉదయం, మధ్యాహ్నం కూడా పరీక్షలు కొనసాగుతాయని ఇందుకు సంబంధించి ప్రశ్నాపత్రాలు ఆయా హెచ్ఎంలకు అప్పగించామన్నారు.


