News February 24, 2025

పల్నాడు: కోటప్పకొండ జాతరకు రహదారులు సిద్ధం 

image

నరసరావుపేటలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పురస్కరించుకొని జరిగే త్రికోటేశ్వరస్వామి జాతరకు రహదారులు సిద్ధమయ్యాయి. 10 రోజులుగా ప్రభుత్వ శాఖలు కొండకు వచ్చే రహదారులలో మరమ్మతులు చేపట్టాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, పెట్లూరు వారిపాలెం, జేఎన్టీయూ, పమిడిమర్రు, గురవాయపాలెం కాలువ కట్ట రోడ్లు, గిరి ప్రదక్షిణ మార్గాలు వాహనాల రాకపోకలకు అందుబాటులోకి వచ్చాయి. 

Similar News

News March 20, 2025

రేపటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా 2,650 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉ.9.30 నుంచి మ.12.30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌‌లు తీసుకెళ్లకూడదు.
* ALL THE BEST

News March 20, 2025

బాలం రాయి హై స్కూల్‌ను సందర్శించిన మంత్రి, కలెక్టర్

image

విద్యారంగం ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని HYD ఇన్‌‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ నల్లగుట్ట బాలంరాయి హైస్కూల్​లో ఎఫ్ఎల్ఎన్, ఏఎక్సెల్ ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను కలెక్టర్‌తో కలసి పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి, DEO ఉన్నారు.

News March 20, 2025

విజయవాడలో అగ్నిప్రమాదం

image

విజయవాడలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మాచవరం పోలీసుల వివరాల మేరకు బందర్ రోడ్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద కిచెన్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెస్టారెంట్‌లోని కిచెన్ మొత్తం దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!