News March 15, 2025
పల్నాడు చరిత్రను ప్రపంచానికి చాటుదాం

గతం నాస్తి కాదు మిత్రమా.. తరతరాల నీ ఆస్తి అన్నాడు ఒక కవి. తరతరాల పల్నాటి చారిత్రక సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషిచేస్తున్నట్లు పల్నాడు మహా శైవ క్షేత్ర కార్యనిర్వహణ కమిటీ తెలిపింది. 12వ శతాబ్దంలో పల్నాడు వీర వనిత నాయకురాలు నాగమ్మ నిర్మించిన శివాలయం పునః ప్రతిష్ఠ కార్యక్రమం ఈనెల 16న జరుగుతుందన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన 272 అడుగుల రాజగోపురం, ఆధ్యాత్మిక, యోగ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News December 7, 2025
కృష్ణా: వసతి గృహాల పర్యవేక్షణకు యాప్

వసతి గృహాల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో HPTS అనే ప్రత్యేక యాప్ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా అధికారులు వసతి గృహాల్లోని సేవలను నిరంతరం పర్యవేక్షించవచ్చు. రోజువారీ, వారాంతపు నిర్వహణ పనులను తప్పనిసరిగా ఈ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
News December 7, 2025
ANU పరీక్షల్లో డిజిటల్ విధానం.. ప్రశ్నపత్రాల లీకేజీకి చెక్

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు ఆచార్య నాగార్జున వర్సిటీ (ANU) డిజిటల్ విధానాన్ని ప్రారంభించింది. ఇకపై పరీక్షా కేంద్రాలకు పాస్వర్డ్ ఉన్న సీడీల్లోనే ప్రశ్నపత్రాలు పంపనున్నారు. ఇప్పటికే బీఈడీ, లా కోర్సుల్లో ఈ పద్ధతి అమలవుతోంది. మోడరేషన్ కోసం గుంటూరు, నరసరావుపేట, తెనాలి ప్రాంతాల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News December 7, 2025
వరంగల్: సర్పంచ్కు పోటీ.. 9 మందిది ఒకే ఇంటి పేరు!

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. వీరిలో 9 మంది ఒకే ఇంటి పేరు గల అభ్యర్థులు ఉండడం ఓటర్లకు తలనొప్పిగా మారింది. సీనపెల్లి అనే ఇంటి పేరుతో ఉన్న అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తుండగా, ఇందులో సీనపెల్లి రాజు అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దీంతో ఎన్నికల పోలింగ్ సమయంలో ఎవరికి ఓట్లు పడతాయో అర్థం కానీ పరిస్థితి.


