News March 15, 2025

పల్నాడు చరిత్రను ప్రపంచానికి చాటుదాం 

image

గతం నాస్తి కాదు మిత్రమా.. తరతరాల నీ ఆస్తి అన్నాడు ఒక కవి. తరతరాల పల్నాటి చారిత్రక సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషిచేస్తున్నట్లు పల్నాడు మహా శైవ క్షేత్ర కార్యనిర్వహణ కమిటీ తెలిపింది. 12వ శతాబ్దంలో పల్నాడు వీర వనిత నాయకురాలు నాగమ్మ నిర్మించిన శివాలయం పునః ప్రతిష్ఠ కార్యక్రమం ఈనెల 16న జరుగుతుందన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన 272 అడుగుల రాజగోపురం, ఆధ్యాత్మిక, యోగ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. 

Similar News

News April 16, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ‘దోస్త్’ సందడి

image

డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST) ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థలైన నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ​అనుభవజ్ఞులైన అధ్యాపకులు, మెరుగైన వసతులు ఉండటంతో ఈ కళాశాలలకు డిమాండ్ పెరిగింది. మే 7 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లకు గడువు ఉంది.
#SHAREIT

News April 16, 2026

HYD: మత్తుకు బానిసయ్యారా? ఇక్కడికి తీసుకురండి

image

మత్తుకు బానిసైన వారికి విముక్తి కల్పించడం కోసం ప్రభుత్వం డీ అడిక్షన్ సెంటర్లను ప్రారంభించింది. HYD గాంధీ ఆసుపత్రిలోనూ సెంటర్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సేవలు ప్రారంభమయ్యాయి. మద్యం, గంజాయి, సిగరెట్ ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారటంతో వ్యక్తిగత జీవితంతో పాటు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటి నుంచి విముక్తి కల్పించడం కోసం చర్యలు చేపట్టారు.

News April 16, 2026

WGL: తెర మీదకు పాత నియోజకవర్గ పేర్లు!

image

అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 నుంచి 18 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది.దీంతో పెరిగే నియోజకవర్గాలు ఏంటనే చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలు, గతంలో కనుమరుగైన నియోజకవర్గాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. శాయంపేట, ధర్మసాగర్, గుడూరు, చేర్యాల, హసన్‌పర్తితో పాటుగా కొత్తగా నెక్కొండ, కాజీపేట నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలంటున్నారు.