News August 19, 2024

పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

పిడుగురాళ్లలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైకు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన మారురి నాగతేజారెడ్డి(25), ఇందూ (30), అమూల్య (15)లు గురజాలలో వివాహానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నారు. టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీని బైకు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 

Similar News

News January 1, 2026

GNT: అల్లర్లు లేవు.. పోలీసుల పక్కా ప్లాన్ సక్సెస్.!

image

నూతన సంవత్సర వేడుకలతో గుంటూరు జిల్లా సందడిగా మారింది. పూలబొకేలు, స్వీట్స్, కేకుల విక్రయాలు జోరుగా సాగాయి. ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులతో మహిళలు, యువతులు సందడి చేశారు. అర్ధరాత్రి నుంచే యువత శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా యువత కొద్దిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా గుంటూరు జిల్లా పోలీసుల చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.

News January 1, 2026

GNT: అల్లర్లు లేవు.. పోలీసుల పక్కా ప్లాన్ సక్సెస్.!

image

నూతన సంవత్సర వేడుకలతో గుంటూరు జిల్లా సందడిగా మారింది. పూలబొకేలు, స్వీట్స్, కేకుల విక్రయాలు జోరుగా సాగాయి. ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులతో మహిళలు, యువతులు సందడి చేశారు. అర్ధరాత్రి నుంచే యువత శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా యువత కొద్దిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా గుంటూరు జిల్లా పోలీసుల చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.

News December 31, 2025

GNT: SC, ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి

image

గుంటూరు జిల్లా SC,ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి బ్రహ్మయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కమిటీకి సభ్యుడుగా నియమించిన గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం 1989లో ఏర్పాటు చేసిన చట్టాన్ని ఎవరైనా దుర్వినియోగపరిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.