News April 14, 2025

పల్నాడు జిల్లాలో ఇద్దరికి షైనింగ్‌స్టార్ అవార్డులు

image

ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్ అవార్డులు ఇస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిని నీలావతి దేవి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15వ తేదీన స్వయంగా ఈ అవార్డులు అందిస్తారని పేర్కొన్నారు. జిల్లా నుంచి పమ్మి కీర్తన (970 మార్కులు), జంగా కీర్తన (902 మార్కులు) ఎంపికయ్యారని నీలావతి దేవి వెల్లడించారు.

Similar News

News October 20, 2025

NLG: అమ్మో ఈ ఆలయాలకు వెళ్లాలంటేనే..

image

జిల్లాలో ఈజీ మనీ కోసం ట్రాన్స్ జెండర్లు వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పలు ఆలయాల వద్ద తిష్ట వేస్తున్న ట్రాన్స్‌జెండర్లు భక్తుల నుంచి అడ్డగోలుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నిడమనూరు(M) కోట మైసమ్మ, కనగల్(M) దర్వేశిపురం ఆలయాల వద్ద అమ్మవార్లకు మొక్కుబడులు చెల్లించేందుకు, కొత్త వాహనాలకు పూజలు చేసుకునేందుకు వచ్చిన భక్తుల వద్దకు గుంపులుగా చేరుకొని ట్రాన్స్‌జెండర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

News October 20, 2025

ప్రతి గడపలో దీపావళి వెలుగులు నింపాలి: కేసీఆర్

image

దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానపు వెలుగులు నింపే స్ఫూర్తి ఈ పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో ప్రగతి వెలుగులు విరజిమ్మాయని, ప్రజల జీవితాల్లో ఆనందం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట గడపలో దీపాల కాంతులు వెలుగునింపాలని ప్రార్థించారు.

News October 20, 2025

MBNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ నెల 22 వరకు తేనెటీగల పెంపకంపై శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల యువకులు బండమీదిపల్లిలోని RSETY కేంద్రంలో లేదా 9963369361, 9542430607 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.