News April 14, 2025

పల్నాడు జిల్లాలో ఇద్దరికి షైనింగ్‌స్టార్ అవార్డులు

image

ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్ అవార్డులు ఇస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిని నీలావతి దేవి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15వ తేదీన స్వయంగా ఈ అవార్డులు అందిస్తారని పేర్కొన్నారు. జిల్లా నుంచి పమ్మి కీర్తన (970 మార్కులు), జంగా కీర్తన (902 మార్కులు) ఎంపికయ్యారని నీలావతి దేవి వెల్లడించారు.

Similar News

News April 21, 2025

రేపు ఇంటర్‌ రిజల్ట్స్.. మేడ్చల్‌లో వెయిటింగ్

image

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన మేడ్చల్ జిల్లాలో 150 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 71,286 విద్యార్థులకు 69,842 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 63,946 విద్యార్థులకు 62,969 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2News<<>>లో చెక్ చేసుకోండి.
SHARE IT

News April 21, 2025

రేపు ఇంటర్‌ రిజల్ట్స్.. రంగారెడ్డిలో వెయిటింగ్

image

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన రంగారెడ్డి జిల్లాలో 185 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 83,829 విద్యార్థులకు 81,966 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 71,684 విద్యార్థులకు 70,431 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2News<<>>లో చెక్ చేసుకోండి.
SHARE IT

News April 21, 2025

తిరుపతి SVU పరీక్షలు వాయిదా

image

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాల్గో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించిన పరీక్షలను మే 12, 14 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. 24 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

error: Content is protected !!