News April 4, 2025
పల్నాడు జిల్లాలో ఒకరి హత్య

మాచర్ల నియోజకవర్గ పరిధిలో హరిచంద్ర హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఆయన మృతదేహం పొలంలో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ హిల్ కాలనీలో హరిచంద్ర కిడ్నాప్కు గురయ్యారు. రెండు రోజుల తర్వాత ఆయన శవమై కనిపించారు. పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. హత్యకు కుటుంబ కలహాలు కారణమా? రాజకీయా కోణమా? అనేది దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 19, 2025
ఖమ్మం: డిగ్రీ విద్యార్థులలో అయోమయం

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు సోమవారం నుంచి 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ యూనివర్సిటీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు హాల్ టికెట్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలు కొనసాగుతాయా? వాయిదా పడతాయా? యూనివర్సిటీ అధికారులు తెలపకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News April 19, 2025
OTTలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్.. ఈ వీకెండ్ చూసేయండి..

*Officer On Duty- Netflix: తాకట్టులో పెట్టిన దొంగ బంగారంతో కథ మొదలవుతుంది. కుంచాకో బోబన్ దర్యాప్తు.. ఒక సీరియల్ కిల్లర్ గ్యాంగ్ దగ్గరకు చేరుతుంది. ఇన్టెన్స్, యాక్షన్, ఎమోషన్తో సాగే ఒక బెస్ట్ క్రైమ్ డ్రామా.
*Dahaad(సిరీస్)- Prime: మిస్సైన అమ్మాయిలు పబ్లిక్ టాయిలెట్లో శవాలుగా దొరుకుతుంటారు. ఈ మిస్టరీ ఛేదించేందుకు సోనాక్షి యాక్షన్లోకి దిగుతుంది. పోలీసులతో కిల్లర్ ఆడే మైండ్ గేమ్ కట్టిపడేస్తుంది.
News April 19, 2025
RCBకి చిన్నస్వామి స్టేడియమే శాపమా?

18 ఏళ్లుగా IPL టైటిల్ కొట్టాలనే RCB కలలపై సొంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం నీళ్లు చల్లుతోంది. బయటి మైదానాల్లో గెలుస్తున్న RCB ఇక్కడ మాత్రం చేతులెత్తేస్తోంది. ఈ స్టేడియం చిన్నగా ఉండటం సొంత జట్టుకన్నా ప్రత్యర్థులకే ఎక్కువగా ఉపయోగపడుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత WPL, IPLలో కలిపి ఇక్కడ 7 మ్యాచులు వరుసగా ఓడడంతో ఈ మైదానం RCBకి అచ్చిరావడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు.