News April 14, 2025
పల్నాడు జిల్లాలో టాప్ న్యూస్

☞ నరసరావుపేట: అభ్యంతరకర పోస్టులతో వివాహిత మృతి ☞ చిలకలూరిపేట: పీఏసీ సభ్యురాలుగా మాజీమంత్రి విడుదల రజిని.. సత్తెనపల్లి: లారీ కిందపడి వ్యవసాయ కూలి మృతి☞ ఎడ్లపాడు: లింగారావుపాలెం గ్రామంలో నాటిక పోటీలు ☞ నాదెండ్ల: అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వామి దగ్ధం ☞ నూజెండ్ల: మండలంలో వడగండ్ల వాన☞ పిడుగురాళ్ల: బ్రాహ్మణపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం
Similar News
News November 21, 2025
కొమరోలు: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

కొమరోలు మండలం తాటిచెర్ల విద్యుత్ శాఖ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న ఎం.బీకోజీ నాయక్ (42) గుండె పోటులో మృతి చెందారు. ఇతని స్వగ్రామం పుల్లలచెరువు గ్రామం కాగా తాటిచర్ల విద్యుత్ లైన్మెన్గా కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొమరోలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News November 21, 2025
7337359375 నంబర్కు HI అని పంపితే..

AP: అన్నదాతలు ధాన్యం విక్రయించే ప్రక్రియను సులభతరం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 వాట్సాప్ నంబర్కు HI అని మెసేజ్ పంపితే సేవల వినియోగంపై AI వాయిస్ అవగాహన కల్పిస్తుందన్నారు. ‘తొలుత రైతులు ఆధార్ నంబర్ నమోదు చేశాక పేరును ధ్రువీకరించాలి. తర్వాత ధాన్యం విక్రయించే కేంద్రం, తేదీ, సమయం, ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదుచేయాలి. వెంటనే స్లాట్ బుక్ అవుతుంది’ అని చెప్పారు.
News November 21, 2025
HYD పోలీసులు మల్టీ ప్లేయర్గా పనిచేయాలి: సీపీ

నగరంలో ట్రాఫిక్ విభాగం పనితీరు రోజురోజుకు మెరుగుపడుతోందని సీపీ సజ్జనార్ అన్నారు. బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో ఆయన ట్రాఫిక్ విభాగంపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రంక్& డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ తదితర ఉల్లంఘనలను ఏ మాత్రం ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. HYD పోలీసులు మల్టీ ప్లేయర్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.


