News April 6, 2025

పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పల్నాడు జిల్లాలో వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు☞ నరసరావుపేట: చికెన్ స్టాల్స్‌లో అధికారులు తనిఖీలు☞ వినుకొండ: చెరువులో మునిగి బాలుని మృతి ☞ రొంపిచర్ల: పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు,☞ ఎడ్లపాడు: ఆకట్టుకున్న నాటిక పోటీలు☞  పల్నాడు జిల్లాలో ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర

Similar News

News October 21, 2025

నల్లుల బెడద.. గూగుల్ ఆఫీసు తాత్కాలికంగా మూత!

image

టెక్ దిగ్గజం గూగుల్‌కు అనుకోని సమస్య వచ్చింది. నల్లుల బెడదతో న్యూయార్క్‌లోని చెల్సియా క్యాంపస్‌ తాత్కాలికంగా మూతబడింది. దీంతో ఉద్యోగులు WFH చేయాలని మెయిల్ పెట్టింది. నల్లుల సమస్య పరిష్కారమయ్యే వరకు ఆఫీసుకు రావద్దని చెప్పినట్లు సమాచారం. ఈ నెల 19న నల్లుల నివారణ చర్యలు చేపట్టి, సోమవారం నుంచి ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిచ్చింది. 2010లోనూ గూగుల్ 9th అవెన్యూ ఆఫీసులు ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవడం గమనార్హం.

News October 21, 2025

విజయవాడలో ఆ స్థలం వినియోగిస్తే లక్షల మందికి మేలు!

image

గుణదలలోని ESI ఆసుపత్రి స్థలం ఆక్రమణలకు గురవుతోంది. మొత్తం 25 ఎకరాల్లో 2 ఎకరాలు ఇప్పటివరకు ఆక్రమణలకు గురైంది. మిగతా 23 ఎకరాల స్థలం ముళ్ళ కంపలు పెరిగిపోయి అడవిని తలపిస్తోంది. ESI విజయవాడ డివిజన్ పరిధి 7 జిల్లాలో 5 లక్షలకు పైగా కార్మికులు బీమా చెల్లిస్తున్నారు. వీరందరికీ వైద్యం అందించేందుకు కనీసం ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులో లేదు. ఈ 23 ఎకరాల స్థలాన్ని అందుకు వినియోగిస్తే బావుంటుంది.

News October 21, 2025

మానవపాడు: రైలు కిందపడి యువకుడి సూసైడ్

image

ఆరోగ్యం బాగోలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మానవపాడులో చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు.. మానవపాడుకు చెందిన ఆనంద్ (26) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్. ఆరోగ్యం బాగో లేకపోవడంతో మానసికంగా బాధపడుతూ జీవితంపై విరక్తితో మానవపాడు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.