News April 6, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ పల్నాడు జిల్లాలో వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు☞ నరసరావుపేట: చికెన్ స్టాల్స్లో అధికారులు తనిఖీలు☞ వినుకొండ: చెరువులో మునిగి బాలుని మృతి ☞ రొంపిచర్ల: పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు,☞ ఎడ్లపాడు: ఆకట్టుకున్న నాటిక పోటీలు☞ పల్నాడు జిల్లాలో ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర
Similar News
News September 17, 2025
అల్లూరి జిల్లాలో రాగల ఐదు రోజుల్లో వర్షాలు

అల్లూరి జిల్లాలో రానన్న ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి మంగళవారం తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 5.2 మి.మీ నుంచి గరిష్ఠంగా 10 మి.మీ వర్షపాతం నమోదు అవుతుందన్నారు. గాలిలో తేమ 65 నుంచి 88 శాతం ఉంటుందన్నారు.
News September 17, 2025
బతుకమ్మ పండుగకు గ్రేటర్ వరంగల్లో ఘనతరమైన ఏర్పాట్లు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(GWMC) కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మంగళవారం ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. హన్మకొండలో 26 ప్రాంతాలు, వరంగల్లో 20 ప్రాంతాల్లో జరగనున్న వేడుకలకు శానిటేషన్, విద్యుత్ లైటింగ్, తాగునీటి సదుపాయాలను సమయానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News September 17, 2025
జగిత్యాల: రూ.300 అద్దె కోసం దారుణ హత్య

రూ.300 కోసం హత్య చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాస-గుల్లపేట సమీపంలో చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ నహిముద్దీన్ను అద్దె విషయంలో బీహర్కు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్ని అనే కూలీలు దారుణంగా హతమార్చారు. ఆటో అద్దె విషయంలో వాగ్వాదం పెరగడంతో గుడ్డతో మెడకు ఉరి వేసి, బండతో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ రఘు చందర్ వెల్లడించారు.