News April 7, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ జిల్లాలో భారీగా ఈదురు గాలులు☞ వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు☞ చిలకలూరిపేటలో గ్రీవెన్స్ నిర్వహించిన కలెక్టర్ ☞ నరసరావుపేటలో బాలికల వసతి గృహం తనిఖీ ☞ పెదకూరపాడులో ఉచిత మెడికల్ క్యాంపులు ☞ ఎడ్లపాడు ఎస్ఐగా శివరామకృష్ణ బాధ్యతలు
Similar News
News October 16, 2025
ఇకపై చికెన్ షాపులకు లైసెన్సులు!

AP: చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు షాపులకు కొత్తగా లైన్సెనింగ్ విధానం తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. కోడి ఏ ఫామ్ నుంచి వచ్చింది? దుకాణదారుడు ఎవరికి అమ్మారు? అనే అంశాలను ట్రాక్ చేసే వ్యవస్థను తీసుకురానుంది. గుర్తింపు పొందిన షాపుల నుంచే హోటళ్లు చికెన్ కొనేలా ప్రోత్సహించడం, స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి పెట్టనుంది.
News October 16, 2025
MNCL: భర్త వేధింపులు భరించలేకనే..!

నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమ ప్రస్థానంలో కొనసాగిన 60 మంది మావోయిస్టులు బుధవారం గడ్చిరోలిలో మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. వారిలో మంచిర్యాల(D) బెల్లంపల్లికి చెందిన సలాకుల సరోజ ఉన్నారు. ఆమె పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పని చేశారు. తల్లిదండ్రులు సరోజకు 15 ఏళ్ల ప్రాయంలో వివాహం చేశారు. భర్త వేధింపులు భరించలేక ఉద్యమానికి ఆకర్షితురాలై పోరుమార్గాన్ని ఎంచుకున్నారు.
News October 16, 2025
జనగామ: 18న విద్యాసంస్థల బంద్: జేఏసీ

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఈనెల 18న జనగామ జిల్లాలోని విద్యాసంస్థలను బంద్ చేయనున్నట్లు బీసీ జేఏసీ ప్రతినిధులు తీర్మానించారు. కావున ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వరంగ పరిధిలోని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని కోరారు.