News April 12, 2025

పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పల్నాడుకు 23(ప్రథమ), 9( ద్వితీయ) స్థానాలు, ☞ అమరావతి: మద్యం మత్తులో హత్యకు గురైన కోటేశ్వరరావు, ☞ నరసరావుపేట: జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆందోళన, ☞ నాదెండ్ల: పురుగు మందు తాగి వృద్ధురాలు మృతి, ☞ ఈపూరు: వైన్ షాపుల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు, ☞మాచర్ల: రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు. 

Similar News

News November 3, 2025

GWL: ప్రజావాణికి 132 ఫిర్యాదులు

image

గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 132 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 60 దరఖాస్తులు అందాయని చెప్పారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

మెదక్: చేవెళ్ల ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి

image

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. పేషెంట్ల కండీషన్‌ను డాక్టర్లు మంత్రికి వివరించారు. ఒక్కరికి మాత్రమే హెడ్ ఇంజురీ కాగా, ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. అందరికీ మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. వైద్య ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. బాధితులతో మాట్లాడిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ధైర్యం చెప్పారు.

News November 3, 2025

ముంబైలో 70KMల అండర్ గ్రౌండ్ టన్నెల్: MMRDA

image

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ముంబై రోడ్లపై ప్రయాణమంటే అక్కడి వారికి రోజూ నరకమే. దాన్నుంచి తప్పించేందుకు MMRDA ఏకంగా 70KM మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ మార్గాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్టును రూపొందిస్తోంది. మూడు ఫేజ్‌లుగా నిర్మాణం జరగనుంది. అక్కడ నిర్మిస్తున్న అంతర్గత టన్నెల్ మార్గాలకు వేరుగా దీన్ని నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రయాణం సాఫీ అవుతుంది.