News March 17, 2025

పల్నాడు జిల్లాలో పలువురు పోలిస్ సిబ్బంది బదిలీలు

image

పల్నాడు జిల్లాలో పలువురు పోలీసు సిబ్బందిని బదిలీలు చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వివిధ పోలిస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.  అదే విధంగా పలువురు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని బదిలీలు చేస్తూ, పోస్టింగ్స్ ఇచ్చారు. 

Similar News

News December 16, 2025

ప.గో: విద్యార్థులూ అలర్ట్.. రేపే కౌనెల్సింగ్

image

తాడేపల్లిగూడెం(M) వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈనెల 17, 18వ తేదీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులలో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 17న పీజీ, 18న పీహెచ్‌డీ కోర్సులకు మాన్యువల్ కౌన్సెలింగ్ జరుగుతుందని, అర్జీదారులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

News December 16, 2025

ప్రసారభారతిలో ఉద్యోగాలు

image

ప్రసార భారతి, న్యూఢిల్లీలో 16 కాస్ట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. CMA ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కాస్ట్ ట్రైనీలకు ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు. మొదటి సంవత్సరం రూ.15,000, రెండో సంవత్సరం రూ.18,000, మూడో సంవత్సరం రూ.20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in

News December 16, 2025

కృష్ణా: డిజిటల్ OP దండగ.. ఆస్పత్రుల్లో రోగుల అవస్థలు

image

విజయవాడలోని కొత్త, పాత GGHలు, మచిలీపట్నం GGHలో ప్రవేశపెట్టిన డిజిటల్ OP విధానం రోగులకు ఇబ్బందిగా మారింది. యాప్‌లో వివరాలు నమోదు చేసినా, మళ్లీ కౌంటర్లలో క్యూలైన్‌లలో నిలబడి టోకెన్‌లు, పేపర్ OP తీసుకోవాల్సి వస్తోంది. సాధారణ OP కన్నా ఇది ఎక్కువ సమయం పడుతుండటంతో రోగుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. త్వరలో నేరుగా ఫోన్‌లోనే OP పొందే నూతన విధానం రానుందని అధికారులు తెలిపారు.