News March 21, 2025

పల్నాడు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై JC సమీక్ష

image

పల్నాడు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల కేటాయింపు, చిన్న, సూక్ష్మత రహ పరిశ్రమలకు ప్రోత్సాహంపై చర్చించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ అనుమతుల పురోగతి గురించి చర్చించారు. మార్చి నెలలో 129 దరఖాస్తులు రాగా.. 122 ఆమోదించబడ్డాయని కమిటీ తెలిపింది. బ్యాంకులలో రుణాలు వేగంగా ఉండాలన్నారు.

Similar News

News October 29, 2025

రేపటి నుంచి ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్స్ రీ ఓపెన్.. కానీ కండిషన్స్ అప్లై!

image

తుఫాన్ ప్రభావం లేని, పునరావాస కేంద్రాలుగా ఉపయోగించని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ నెల 30వ తేదీ నుంచి రీఓపెన్ చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ తెలిపారు. అయితే, పాఠశాల భవనాలు సురక్షితమని అధికారులు ధ్రువీకరించిన తర్వాతే తెరవాలని సూచించారు. ప్రతి పాఠశాల ప్రాంగణంలో, తరగతి గదుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌ను కలెక్టర్ ఆదేశించారు.

News October 29, 2025

తుఫాను ప్రభావిత ప్రజలకు సకాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలి: కలెక్టర్

image

మొంథా తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రెవెన్యూ, వ్యవసాయం, మత్స్య, పౌరసరఫరాల శాఖల అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సహాయం పంపిణీ, తుఫాను నష్ట గణనపై అధికారులతో చర్చించారు.

News October 29, 2025

అలా అయితే బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా

image

భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియాతో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే బంగ్లా ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని రాయిటర్స్‌కు మెయిల్‌లో తెలిపారు. అవామీ లీగ్‌కు లక్షలాది మంది మద్దతిస్తున్నారని, తమ పార్టీని పోటీకి అనుమతించకుంటే 2027 ఎన్నికలను వారు బహిష్కరిస్తారన్నారు. చట్టబద్ధమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే బంగ్లా వెళ్తానని చెప్పారు.