News February 11, 2025
పల్నాడు: జిల్లాలో 128 కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు

పల్నాడు జిల్లాలో 128 కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ మురళి వెల్లడించారు. సోమవారం 10 తరగతి పరీక్షల నిర్వహణపై డీఈవో చంద్రకళతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో మంచినీరు, వెలుతురు, బాత్రూంలు, మెడికల్ వ్యాన్లు, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన బస్సులు ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ జస్వంత్ ఉన్నారు.
Similar News
News December 6, 2025
కొక్కెర వ్యాధి – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు ఈ కొక్కెర వ్యాధి రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.
News December 6, 2025
KNR: రూ.4.50CR SCAM.. ఎంక్వయిరీ రిపోర్ట్ ఎక్కడ..?

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4.5 కోట్ల అవినీతి ఆరోపణలపై TVVP రెండు బృందాలతో విచారణ చేపట్టింది. దీనిపై ఎంక్వయిరీలో ఏం తేలిందన్నది బహిర్గతం చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వంలోని ఓ కీలక నేత రిపోర్టు బయటకు రాకుండా తొక్కిపెడుతున్నాడన్న చర్చ జోరుగా నడుస్తోంది. దీనిపై మంత్రులు జోక్యం చేసుకొని నిజానిజాలు బయట పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
News December 6, 2025
మాయిశ్చరైజర్ వాడితే చర్మం జిడ్డుగా మారుతోందా?

చలికాలంలో చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి. అయితే కొందరిలో దీనివల్ల చర్మం జిడ్డుగా మారి, మొటిమలు కూడా వస్తుంటాయి. ఇలాంటప్పుడు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని వాడటం వల్ల చర్మంలోకి మాయిశ్చరైజర్ ఇంకి పొడిబారిపోకుండా సంరక్షిస్తుందంటున్నారు. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్టును కలవడం మంచిదని సూచిస్తున్నారు.


