News May 11, 2024

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

నేటి సాయంత్రం 6:00 గంటల నుంచి 14వ తేదీ సాయంత్రం 6:00 గంటల వరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా.. 144 సెక్షన్ విధిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్‌ లోతోటి శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి సాయంత్రంతో ప్రచారం ముగియడంతో ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎవరూ కూడా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News February 9, 2026

మంగళగిరిలో మేఘాలయ బృందం పర్యటన

image

‘ఎనీమియా ముక్త్ భారత్’ పరిశీలన ఆంధ్రప్రదేశ్‌లో’ ఎనీమియా ముక్త్ భారత్’ అమలు తీరును పరిశీలించేందుకు మేఘాలయ NHM ఉన్నతాధికారుల బృందం సోమవారం మంగళగిరిలో పర్యటించింది. స్థానిక ఉన్నత పాఠశాల, పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రక్తహీనత నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంలో AP అగ్రస్థానంలో ఉన్నందున క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చామని అధికారులు తెలిపారు. రేపు అంగన్వాడీ, PHCలను ఈ బృందం సందర్శించనుంది.

News February 9, 2026

గుంటూరులో ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు

image

గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా జరుగుతున్న “భారత రంగ్ మహోత్సవ్-అంతర్జాతీయ నాటకోత్సవాలు” సోమవారంతో 4వ రోజుకు చేరాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. తెలుగు నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తదితరులు పాల్గొని సీనియర్ కళాకారులను ప్రత్యేకంగా సత్కరించారు.

News February 9, 2026

రైతుల కోసం ఉబర్ తరహాలో డ్రోన్ సేవలు: కలెక్టర్

image

ఉబర్ తరహాలో డ్రోన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రైతుల అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉబర్‌ క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు పొందవచ్చన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అంతటా సేవలు లభిస్తాయని చెప్పారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు డ్రోన్ ద్వారా చల్లడం వంటి ప్రయోజనాలు పొందవచ్చన్నారు.